విజయవాడ టూ అమరావతి కొత్త రూట్ రెడీ..! కరకట్టకు చెక్..!
ఏపీ రాజధాని అమరావతికి విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ప్రస్తుతం అమరావతి రాజధానికి వెళ్లాలంటే ప్రకాశం బ్యారేజ్ దాటి కుడివైపుకు మళ్లాక వచ్చే కరకట్ట రోడ్డు మీదుగానే ప్రయాణాలు సాగించాల్సి వచ్చేది. అదీ సింగిల్ రోడ్డు కావడంతో రెండు వైపులా ఒకేసారి వాహనాలు ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఉండేవి. ఏదైనా తేడా వస్తే వాహనాలు కరకట్టపై నుంచి కిందకి పడిపోయే పరిస్ధితి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎప్పటినుంచో జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి.
విజయవాడ నగరం నుంచి ఉండవల్లిపై ఉన్న కరట్ట మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డుపై సాగుతున్న ప్రయాణాల రూటును కాస్త మార్చి పక్కనే మరో రోడ్డును అందుబాటులోకి తెచ్చారు.ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత కరకట్టతో సంబంధం లేకుండా నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డును కలిపే విధంగా కొత్త రోడ్డు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో పక్కనే ఉన్న గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్న వంతెన పనులు మాత్రమే మిగిలాయి. ఇవి కూడా పూర్తి కాగానే ఇక నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా రాజధానికి ప్రయాణాలు చేసేందుకు వీలు కలుగుతుంది.

ప్రస్తుతం అమరావతిలోని కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో మిగిలిన పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇందులో భాగంగా మంగళగిరివైపు సీడ్ యాక్సెస్ రోడ్డులో మిగిలిన 1.5 కిలోమీటర్ల మార్గాన్ని తాజాగా పూర్తి చేశారు. దీన్ని ప్రకాశం బ్యారేజ్ దాటాక మెయిన్ రోడ్డుకు కలపనున్నారు. దీంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం గణనీయంగా తగ్గిపోనుంది.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు గుంటూరు చానెల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ నెలాఖరుకు స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చారు. కరకట్టపై వెళ్ళే అవసరం లేకుండా త్వరలోనే బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
-
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!











Click it and Unblock the Notifications