రివర్స్: 14ఏళ్ల బాలుడిపై మహిళ రేప్, ఇంటికి తీసుకెళ్లి అసభ్యప్రవర్తన, పిలిచినప్పుడల్లా రావాలని
విజయవాడ: విజయవాడలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలుడిపై 45 ఏళ్ల మహిళ అత్యాచారానికి ఒడిగట్టింది. బాధిత బాలుడి కుటుంబ సభ్యులు సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా, ఫిర్యాదు తర్వాత వెలుగు చూసింది. ఆ మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నున్న గ్రామీణ పోలీసులకు వారం రోజుల క్రితం ఓ బాలుని కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు అందింది. సదరు బాలుడికి వల వేసి, అతనిని లోబరచుకుని మహిళ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడిని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి పంపించారు.
ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్య ప్రవర్తన
వాంబే కాలనీకి చెందిన 45 ఏళ్ల మహిళ ఇంటికి సమీపంలో ఉండే పద్నాలుగేళ్ల బాలుడితో చనువుగా ఉండేది. ఇటీవల బాలుడిని ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించి లోబరచుకుంది. ఈ విషయం బాలుడు తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
ఎనిదేళ్ల క్రితం భర్త మృతి, ఇంట్లో ఒంటరిగా
సీఐ నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టారు. మహిళపై కేసు నమోదు చేశారు. నిందితురాలి భర్త ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్లిద్దరికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించింది. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటోంది. ఈ సమయంలో ఇంటి ఎదురుగా పదో తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల బాలుడిపై కన్నుపడింది.
పిలిచినప్పుడల్లా రావాలని ఒత్తిడి
అతనితో ఆమె అసభ్యకరంగా ప్రవర్తించేది. పైగా పిలిచినప్పుడల్లా రావాలని ఒత్తిడి చేసేది. దీంతో అతను మరింత భయపడ్డాడు. అప్పటి నుంచి అక్కడ ఉండటం మానివేసి దూరంగా ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లి ఉంటున్నాడట. ఇంటికి రాకపోవడానికి కారణం ఏమిటని తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో అతను అసలు విషయం చెప్పాడట.
పలు సెక్షన్ల కింద కేసులు
దీంతో ఆ తల్లి వచ్చి నిందితురాలిపై చేయి చేసుకొని, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు మహిళపై బాలల హక్కుల సంరక్షణ చట్టం, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆమెకు పదిహేను రోజుల రిమాండ్ విధించింది.