Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమల క్యూ కాంప్లెక్స్, కంపార్ట్‌మెంట్లలో ఇకపై

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 83,271 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,018 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.78 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుండి 14 గంటల సమయం పట్టింది.

భక్తులకు మరింత మెరుగైన దర్శనాన్ని కల్పించడానికి టీటీడీ మరో అత్యాధునిక వ్యవస్థను ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో టీటీడీ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన భక్తులకు ఉపశమనం కలిగించేందుకు వర్చువల్ రియాలిటీ (VR) సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ప్రణాళికలు రచిస్తోంది.

Virtual Reality to Transform Waiting Time Tirumala Devotees Guided to the Glory of Lord Venkateswara

ఈ సదుపాయం మొదటి దశలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ కంపార్ట్‌మెంట్లలో అందుబాటులోకి రానుంది. గంటల తరబడి నిరీక్షించే భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా తమ దృష్టిని శ్రీవేంకటేశ్వర స్వామివారిపై కేంద్రీకరించడానికి ఈ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ వీఆర్ హెడ్‌సెట్‌ల ద్వారా భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని, తిరుమల క్షేత్ర ప్రత్యేకతలు, ఇతర పూజాదికాలను వర్చువల్‌గా వీక్షించగలరు.

దాతల సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది. టీటీడీ వివిధ రకాల వర్చువల్ రియాలిటీ పరికరాల పనితీరును పరిశీలిస్తోన్నారు. ఇది అందుబాటులోకి వస్తే వైకుంఠం కంపార్ట్ మెంట్స్, క్యూ కాంప్లెక్స్ లల్లో వేచివుండే భక్తులకు స్వామివారి దివ్య స్వరూపం, అక్కడ జరిగే నిత్య కైంకర్యాలను స్వయంగా వీక్షించినట్టవుతుంది.

దీంతో పాటు టీటీడీ ఆలయాల ప్రాముఖ్యత, నిర్మాణ సౌందర్యం, ఇతర ముఖ్యమైన అంశాలను భక్తులకు వివరించడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) టెక్నాలజీని కూడా పరిగణనలోకి తీసుకుంటోంది టీటీడీ. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అభివృద్ధి చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి ఆలయ శిల్పాలు, చిత్రాలను స్కానింగ్ చేసి, అధునాతన సాంకేతికత ద్వారా వాటికి సంబంధించిన పౌరాణిక, చారిత్రక ప్రాముఖ్యతను భక్తులకు ప్రదర్శించడం దీని ఉద్దేశం.

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కైంకర్యాలను ఎస్‌వీబీసీ ఛానెల్‌లో ప్రసారం చేస్తున్న తరహాలోనే టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాల విశిష్టతను భక్తులకు తెలియజేయడానికి అవసరమైతే ఎస్‌వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానెల్‌ను ప్రారంభించే సాధ్యాసాధ్యాలను కూడా టీటీడీ పరిశీలిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+