తిరుమల క్యూ కాంప్లెక్స్, కంపార్ట్మెంట్లలో ఇకపై
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 83,271 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,018 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.78 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 20 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుండి 14 గంటల సమయం పట్టింది.
భక్తులకు మరింత మెరుగైన దర్శనాన్ని కల్పించడానికి టీటీడీ మరో అత్యాధునిక వ్యవస్థను ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో టీటీడీ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన భక్తులకు ఉపశమనం కలిగించేందుకు వర్చువల్ రియాలిటీ (VR) సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ప్రణాళికలు రచిస్తోంది.

ఈ సదుపాయం మొదటి దశలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో అందుబాటులోకి రానుంది. గంటల తరబడి నిరీక్షించే భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా తమ దృష్టిని శ్రీవేంకటేశ్వర స్వామివారిపై కేంద్రీకరించడానికి ఈ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ వీఆర్ హెడ్సెట్ల ద్వారా భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని, తిరుమల క్షేత్ర ప్రత్యేకతలు, ఇతర పూజాదికాలను వర్చువల్గా వీక్షించగలరు.
దాతల సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది. టీటీడీ వివిధ రకాల వర్చువల్ రియాలిటీ పరికరాల పనితీరును పరిశీలిస్తోన్నారు. ఇది అందుబాటులోకి వస్తే వైకుంఠం కంపార్ట్ మెంట్స్, క్యూ కాంప్లెక్స్ లల్లో వేచివుండే భక్తులకు స్వామివారి దివ్య స్వరూపం, అక్కడ జరిగే నిత్య కైంకర్యాలను స్వయంగా వీక్షించినట్టవుతుంది.
దీంతో పాటు టీటీడీ ఆలయాల ప్రాముఖ్యత, నిర్మాణ సౌందర్యం, ఇతర ముఖ్యమైన అంశాలను భక్తులకు వివరించడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) టెక్నాలజీని కూడా పరిగణనలోకి తీసుకుంటోంది టీటీడీ. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ను అభివృద్ధి చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. మొబైల్ ఫోన్ను ఉపయోగించి ఆలయ శిల్పాలు, చిత్రాలను స్కానింగ్ చేసి, అధునాతన సాంకేతికత ద్వారా వాటికి సంబంధించిన పౌరాణిక, చారిత్రక ప్రాముఖ్యతను భక్తులకు ప్రదర్శించడం దీని ఉద్దేశం.
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కైంకర్యాలను ఎస్వీబీసీ ఛానెల్లో ప్రసారం చేస్తున్న తరహాలోనే టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాల విశిష్టతను భక్తులకు తెలియజేయడానికి అవసరమైతే ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానెల్ను ప్రారంభించే సాధ్యాసాధ్యాలను కూడా టీటీడీ పరిశీలిస్తోంది.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం












Click it and Unblock the Notifications