విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నైజీరియాలో ఇద్దరు ఏపీ ఇంజినీర్ల కిడ్నాప్: కుటుంబసభ్యుల వేడుకోలు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నైజీరియాలో విశాఖపట్నంకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు కిడ్నాప్ వార్త కలకలం రేపుతోంది. ఇంజినీర్ సాయి శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్‌ చేసినట్లు విశాఖపట్నంలోని అతని కుటుంబానికి సమాచారం అందింది.

కాగా, సాయి జీబొకో నగరంలో డంగోటే కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడి ప్రభుత్వానికి డంగోటే సిమెంట్‌ కంపెనీ ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

kidnap

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు విశాఖ వాసులను కిడ్నాప్ చేసిన వారికోసం గాలిస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతీసుకోవాలని బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు కిడ్నాప్ చేసిందెవరు?, ఎందుకు కిడ్నాప్ చేశారన్న విషయం తెలియాల్సి ఉంది.

గతంలో కూడా కొందరిని కిడ్నాప్ చేసిన దుండగులు క్షేమంగానే వదిలిపెట్టారు. ఇటీవల ముగ్గురు ఆస్ట్రేలియన్లను, ఇద్దరు నైజీరియన్లను, న్యూజిలాండ్‌కు చెందిన ఓ కార్మికుడిని, దక్షిణాఫ్రికాకు చెందిన ఓ కార్మిడిని కిడ్నాప్ చేసిన దుండగులు మూడ్రోజుల క్రితం విడిచిపెట్టారు.

English summary
Two engineers from Visakhapatnam, allegedly kidnapped in Nigeria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X