ఆ అధికారి ఇంట్లో లక్షల కుర్చీ, ఇంట్లో సినిమా థియేటర్: పక్కా ప్లాన్తో అక్రమాలు
విజయనగరం జిల్లా డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ లక్ష్మీగణేశ్వర రావు ఆస్తులపై ఏసీబీ మూడు రోజుల క్రితం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో వందల కోట్ల ఆస్తులు వెలుగు చూశాయి. అధికారులు ఆయన ఇంట్లో గుర్త
విశాఖపట్నం: విజయనగరం జిల్లా డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ లక్ష్మీగణేశ్వర రావు ఆస్తులపై ఏసీబీ మూడు రోజుల క్రితం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో వందల కోట్ల ఆస్తులు వెలుగు చూశాయి. అధికారులు ఆయన ఇంట్లో గుర్తించిన వస్తువులను చూస్తే కళ్లు తిరగాల్సిందే.
చదవండి: అవినీతి తిమింగలం, కళ్లు చెదిరే ఆస్తులు: అధికారులకే చుక్కలు, ఏసీబీ పైకి కుక్కలు వదిలాడు

ఇంట్లో రెండున్నర లక్షల రూపాయల కుర్చీ
ఇంట్లో రెండున్నర లక్షల రూపాయల కుర్చీ ఉంది. దర్జాగా కూర్చొని సినిమాలు చూసేందుకు ఓ సినిమా థియేటర్ ఉంది. ఖరీదైన వోల్వో కారు గుర్తించారు.

వందల జీతంతో మొదలై
ఆయన 1982లో దాదాపు రూ.700 జీతంతో డిప్యూటీ సర్వేయర్గా చేరారు. ఆ తర్వాత ఉన్నత పదవులు లభించాయి. క్రమంగా రూ.60వేల జీతం తీసుకునే స్థాయికి ఎదిగాడు.

అక్రమాల కోసం ప్లాన్
నెల్లూరులో ఓ అపార్టుమెంటుమెంటు సెల్లార్లో నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్లాట్ నిర్మించి, అందులో అక్రమ కార్యకలాపాలకు వినియోగించుకునేవాడని ఏసీబీ గుర్తించింది. బయట మాత్రం హైకోర్టు న్యాయవాది అని బోర్డు పెట్టాడు. లోపలకు ఎవరూ రాకుండా ఆ ప్రయత్నం.

పాతపత్రాలుగా చెప్పేందుకు
భూములు కబ్జా చేసేందుకు అవసరమైన ఆధారాల కోసం అతను ఇంట్లో పాతకాలం టైప్ మిషన్ పెట్టుకున్నాడు. దీంతో ఆ కబ్జా పత్రాలు కూడా పాతకాలం వాటిగా చెప్పేందుకు దానిని ఉపయోగించుకున్నాడని గుర్తించారు. ఇంట్లో వివిధ హోదాల్లోని అధికారుల పేర్లతో స్టాంపులు కూడా ఏర్పాటు చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications