ఐసిస్తో సంబంధం, శ్రీహరికోట, విశాఖ పోర్ట్ పేల్చేస్తా: బెదిరింపు లేఖ, అదిలాబాద్ నుంచి!
విశాఖ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటను, విశాఖ విమానాశ్రయాన్ని పేల్చేస్తామని విశాఖ విమానాశ్రయ అథారిటీకి సోమవారం బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపు తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
వెంటనే ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు. బెదిరింపులు లేఖ ద్వారా వచ్చాయి. ఆ లేఖ అదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినట్లు గుర్తించారు. లేఖ నారాయణ పేరుతో వచ్చినట్లుగా తెలుస్తోంది. తనకు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)తో సంబంధాలు ఉన్నట్లుగా అతను లేఖలో పేర్కొన్నాడని సమాచారం.
కాచిగూడ-గుంటూరు మధ్య డబుల్ డెక్కర్ ప్రత్యేక రైళ్లు
దసరా రద్దీ దృష్ట్యా కాచిగూడ-గుంటూరు మధ్య డబుల్ డెక్కర్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 16, 18, 20, 22, 24, 25 తేదీల్లో రాత్రి 11 గంటలకు ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ నుంచి, ఈనెల 17, 19, 21, 23 25 తేదీల్లో రాత్రి 11 గంటలకు గుంటూరు నుంచి ఈ రైళ్లు బయలుదేరతాయని తెలిపారు. ఈ రైళ్లన్నీ ఖాజీపేట, విజయవాడ మార్గంలో నడుస్తాయని వెల్లడించారు.