జూనియర్ ఎన్టీఆర్ బాటలో ఏపీకి విరాళం ప్రకటించిన విశ్వక్ సేన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు ఏపీలో ఎనలేని నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పటివరకు ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 19 మంది మృతి చెందారు. మరోవైపు 73 చెరువులకు గండిపడగా, 1808 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. అపార పంట నష్టం జరిగింది.
ఏపీ వరదలతో అపార నష్టం
ఆంధ్రప్రదేశ్లో ముంపు బాధిత ప్రాంతాలలో జరిగిన నష్టాలు, చేపడుతున్న సహాయక చర్యలతో విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తాజాగా బులిటెన్ విడుదల చేశారు. అపార ప్రాణ నష్టాన్ని నివారించటానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. మొత్తం 176 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసి 41, 927 మందిని ఇప్పటివరకు పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు.

తెలంగాణాలోనూ అపార ప్రాణ, ఆస్తి నష్టం
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానూ అనేక చోట్ల వర్షాలు వరదల కారణంగా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరదలతో ఇప్పటికీ అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో వరద బీభత్సం వేళ రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులపైన సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, యువ హీరోలు స్పందిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ బాటలో విశ్వక్ సేన్ కూడా
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానించే విశ్వక్ సేన్ జూనియర్ బాటలో తన వంతుగా విరాళం ప్రకటించారు.
In these devastating times of calamity, I am pledging a donation of ₹5 lakhs to the Telangana CM Relief Fund to support the flood relief efforts in the state. This contribution is a small step towards alleviating the suffering of those affected by the floods.@revanth_anumula…
— VishwakSen (@VishwakSenActor) September 3, 2024
విశ్వక్ సేన్ చిరు విరాళం
ఏపీ ప్రభుత్వానికి అండగా తన వంతుగా ఈ విపత్తు సమయంలో రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నానని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు మాత్రమే అని పేర్కొన్నారు.
In these devastating times of calamity, I am pledging a donation of ₹5 lakhs to the Andhra Pradesh CM Relief Fund to support the flood relief efforts in the state. This contribution is a small step towards alleviating the suffering of those affected by the floods.…
— VishwakSen (@VishwakSenActor) September 3, 2024
ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వస్తున్న సినీ ప్రముఖులు
ఇక ఇప్పటికే ఏపీ వరదలపై స్పందించిన నిర్మాత అశ్వినీదత్ కూడా వైజయంతి మూవీస్ పేరుతో ఏపీకి 25 లక్షల విరాళం ప్రకటించారు. ఇక ఒక్కొక్కరుగా ఏపీ, తెలంగాణా వరదలపై స్పందిస్తున్నారు. ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వస్తున్నారు. బాధితులకు భరోసా ఇవ్వటానికి మేము సైతం అంటున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications