ఐదు శాతానికి ఒప్పుకోం, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సిందే: ముద్రగడ
కాపు రిజర్వేషన్లపై ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు పెదవి విప్పారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాబోదన్నారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించినంత మాత్రాన కాపులకు ఒరిగేదీమీ ఉండదని తేల్చేశారు.
విజయవాడ: కాపు రిజర్వేషన్లపై ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు పెదవి విప్పారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాబోదన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించినంత మాత్రాన కాపులకు ఒరిగేదీమీ ఉండదని తేల్చి చెప్పారు.
తమ వెనక ప్రతిపక్ష నేత జగన్, మోడీ ఉన్నారనడం సరికాదని, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయించడం మానుకోవాలని హితవు పలికారు. కాపుల రిజర్వేషన్ను తొమ్మిదో షెడ్యూలులో చేరిస్తేనే తమకు దీపావళి అని ముద్రగడ స్పష్టం చేశారు.

ఏపీలో కాపులు కోటి మంది ఉంటే 50 లక్షల మందేనని పల్స్ సర్వేలో చూపించారని ముద్రగడ ఆరోపించారు. ముఖ్యమంత్రి తమకు భోజనం పెడతామని చెప్పి టిఫిన్ పెడుతున్నారని విమర్శించారు.
కాపులు పోరాడి రిజర్వేషన్ సాధించుకున్నారని, అయినా ఈ 5 శాతం రిజర్వేషన్కు తాము ఒప్పుకోమని ముద్రగడ పేర్కొన్నారు. ఇకనైనా తమపై ఆరోపణలు చేయించడం మానుకోవాలని ఆయన కోరారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications