సిగ్గుపడుతున్నా: ఏరాసు, సిఎంతో సహా రిజైన్ చేస్తాం
కర్నూలు/హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ మూర్ఖంగా వ్యవహరిస్తోందని, ఆ పార్టీలో కొనసాగుతున్నందుకు తాను సిగ్గుపడుతున్నానని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోపాటు తామంతా రాజీనామా చేస్తామని చెప్పారు.
విభజన వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలకు కలిగే లాభనష్టాలను, సాగునీటి, నిరుద్యోగం వంటి సమస్యల గురించి బిల్లులో ప్రస్తావించలేదని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ ప్రాంత ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన చెప్పారు. విభజన జరగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన శాయశక్తులా కృషి చేస్తున్నారని ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు.

కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది: అశోక్ బాబు
రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఏపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు ఆరోపించారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఆయన అన్నారు. తమ ఆందోళనకు చాలా పార్టీల నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు.
ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అశోక్ బాబు తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లు లోక్సభలో ఆమోదం పొందదని అశోక్ బాబు చెప్పారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications