ఎన్టీఆర్ కలలుగన్న సమాజం కోసం మేం పనిచేస్తాం: తెలుగులో పీఎం మోడీ!!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తెలుగు సినీ ప్రపంచాన్ని సైతం తన అద్భుత నటన ప్రభావంతో ఓలలాడించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు 101 వ వర్ధంతి నేడు సందర్భంగా తెలుగు వారి కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ఎన్టీ రామారావుకు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా స్పందించారు.
దార్శనికత గల నాయకుడు ఎన్టీఆర్: పీఎం మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం అంటూ పేర్కొన్న మోడీ తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు అని కొనియాడారు.

ఎన్టీఆర్ కలలు కన్నా సమాజం కోసం మేం పనిచేస్తాం: మోడీ
సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు. తెరపై ఆయన ధరించిన పాత్రలను , ఆయన నాయకత్వ పటిమను ఇప్పటికీ తలచుకుంటారు ఆయన అభిమానులు . ఆయన కలలు కన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ట్వీట్ చేశారు.
రాజకీయాల్లో ప్రజానాయకునిగా తిరుగులేని మనిషి: టీడీపీ
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ మేరకు పోస్ట్ చేసింది. సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఎదురులేని మనిషి... రాజకీయాల్లో ప్రజానాయకునిగా తిరుగులేని మనిషి... వెరసి ఎన్టీఆర్ అంటే ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన అద్వితీయ చరితుడు... యుగపురుషుడు అని పేర్కొంది.
పార్లమెంట్ లోనూ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు
దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అని పేర్కొంది. ఎన్టీఆర్ 101 వ జయంతి సందర్భంగా పార్లమెంటులోనూ ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ నివాళులర్పించారు.
తెలుగువారి ఖ్యాతిని చాటిన మహనీయుడు: పురందేశ్వరి
ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఎన్టీఆర్ ఘాట్లో తండ్రికి నివాళులు అర్పించారు. 320సినిమాలకు పైగా నటించారని, ఎన్నో పాత్రలలో జీవించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని ఆమె పేర్కొన్నారు . రాజకీయాలు అధికారం కోసమే కాదని, సేవా మర్గంగా భావించారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. తెలుగువారికి ప్రత్యేక భాష, ఉనికి, చరిత్ర ఉందని ప్రపంచం గుర్తించడానికి ఎన్టీఆర్ కృషి చేశారన్నారు.
-
మావిగాన్ ను జనాల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ..! పేర్ని నాని షాకింగ్..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్











Click it and Unblock the Notifications