'ఒళ్లంతా విషం, అక్కడే స్నానం చేసిన జగన్.. చంద్రబాబుకేం చెప్తారు'
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పట్టిసీమను వ్యతిరేకించిన జగన్, నదుల సంగమం చోటే స్నానం చేశారని ఎద్దేవా చేశారు.
వైయస్ జగన్ పుష్కర స్నానం ఆచరించిన విషయం తెలిసిందే. దీనిపై దేవినేని మాట్లాడారు. జగన్ పట్టిసీమను వ్యతిరేకించారని మండిపడ్డారు. ఏ ప్రాజెక్టునైతే జగన్ వ్యతిరేకించారో.. ఆ నీరు కలిసిన చోట ఆయన స్నానం చేశారని, ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చూసి జగన్ ఏం మాట్లాడుతారన్నారు. పుష్కరాల పైన జగన్ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. జగన్ శరీరమంతా విషమే ఉందన్నారు. పుష్కరాలను కూడా రాజకీయం చేస్తున్నారన్నారు.
ప్రమాదశాత్తు ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగి చనిపోతే, దానిని కూడా జగన్ రాజకీయ చేయడం ఏమిటన్నారు. పుష్కరాలు అద్భుతంగా జరుగుతుంటే అతను ఓర్వలేకపోతున్నారన్నారు. పుష్కర ఘాట్ల నిర్మాణం కోసం రూ.1,700 కోట్లు ఖర్చు చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
కాగా, పుష్కరాల పేరుతో ప్రభుత్వం రూ.1700 కోట్లు ఖర్చు చేస్తోందని జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. అదే సమయంలో కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతిలో నీట మునిగి మృతి చెందిన నందిగామ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications