వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కి చెప్పేదేం లేదు!: భూమా, టిలో ఫాంహౌస్‌కు బాబు కుటుంబం

By Srinivas
|
Google Oneindia TeluguNews

కర్నూలు: తాము గత కొన్నేళ్లుగా ప్రతిపక్షంలోనే ఉండిపోతున్నామని, దీంతో తమ కార్యకర్తలు ఆర్థికంగా నలిగిపోయారని, తమ కార్యకర్తలకు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకే తాము తెలుగుదేశం పార్టీలో చేరానని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియలు చెబుతున్నారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము సైకిల్ ఎక్కామన్నారు. ఏళ్లుగా తాము ప్రతిపక్షంలోనే ఉంటున్నామన్నారు. దీంతో తనను ఈ స్థాయికి తీసుకు వచ్చిన కార్యకర్తలు ఆర్థికంగా చితికిపోయారన్నారు. వారి కోసం కూడా తాము అధికార టిడిపిలో చేరామని చెప్పారు.

అధికారంలోకి వస్తే తాము తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని భావిస్తున్నామన్నారు. చాలా ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి తాము పోరాడుతున్నామని చెప్పారు. తాను 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చానని చెప్పారు. వాటిని నెరవేర్చాలంటే అధికార పార్టీ కావాలని అభిప్రాయపడ్డారు.

Why Bhuma Nagi Reddy joined Telugudesam?

పార్టీలోకి ఇంకా వైసిపి నుంచి ఎవరైనా వస్తారా అని ప్రశ్నించగా.. తాను దాని గురించి మాట్లాడలేనని చెప్పారు. ప్రస్తుతం తన నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమన్నారు. జగన్‌కు ఏమైనా చెబుతారా అంటే.. ఆయనకు చెప్పేదేం లేదన్నారు.

వైసిపి ఎదుగుదల ఇప్పటి వరకు కనిపించడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఎదుగుదల కనిపించక పోవడం వల్లనే తాను టిడిపిలో చేరానని చెప్పారు. ప్రతిపక్ష పార్టీకి భవిష్యత్తు లేదని తానుచెప్పడం లేదని, ఇప్పటి వరకు ఎదుగుదల లేదని మాత్రమే చెబుతున్నానన్నారు.

ఫాంహౌస్‌కు మారనున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి హఫీజ్ పేటలోని ఫాం హౌస్‌కు మారనుంది. జూబ్లీహిల్స్‌లో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయ్యే వరకు చంద్రబాబు కుటుంబం ఫాంహౌస్‌లో ఉండనుంది.

English summary
Why Bhuma Nagi Reddy joined Telugudesam?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X