కాపు రిజర్వేషన్లు, నిరాహార దీక్ష: ఒక్క ముద్రగడ.. ఎన్నో ప్రశ్నలు
హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండుతో నిరాహార దీక్ష చేస్తున్న కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు కాపుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కాపులను వెంటనే బీసీలలో చేర్చాలని పెద్ద ఎత్తున కాపులు రోడ్ల పైకి వస్తున్నారు.
చెవిలో పూవులు పెట్టుకొని, కంచాలను కొడుతూ కాపులు నిరసన తెలిపారు. ఈ సమయంలో రాజకీయ వర్గాల్లో, సామాన్యుల్లో కొత్త చర్చ సాగుతోంది. కాపుల కోసం న్యాయం అంటూ ముద్రగడ పార్టీని పెడతారా? లేక కాపు ఓట్లను టిడిపి నుంచి జగన్ కొల్లగడతారా? అనే చర్చ సాగుతోంది.

ముద్రగడ దీక్ష వెనుక ప్రధానంగా... వైసిపి అధినేత జగన్ ఉన్నారనే చర్చ సాగుతోంది. అయితే, ముద్రగడకు కాపుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పుడు ముద్రగడ.. జగన్ను కార్నర్ చేసి తమ జాతి ప్రయోజనాల కోసం కొత్త పార్టీ పెడతారా అని చాలామంది చర్చించుకుంటున్నారు.
తాను తన జాతి కోసమే జీవిస్తానని ఆయన చెప్పారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు.. కాపుల కోసం ముద్రగడ పైన పార్టీ పెట్టాలనే ఒత్తిడి రావొచ్చునని, దానికి ఆయన సుముఖత వ్యక్తం చేస్తే అది జగన్ను నష్టమేనని అంటున్నారు. కాగా, సోమవారం నాడు ముద్రగడతో టిడిపి నేతలు జరిపిన చర్చలు ఫలించినట్లుగా కనిపిస్తున్నాయి.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications