ఇష్టంలేక పెళ్లైన గంటకే నవ వధువు ఆత్మహత్యాయత్నం

అరుణ అనే యువతి ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతో పెళ్లైన గంట, గంటన్నరకే ఒంటిమీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఈ పెళ్లయింది. ఆ తర్వత గంటకు ఇంట్లోకి వెళ్లి నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బోల్తా పడిన బస్సు
చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఓ ప్రయివేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇరవై రెండు మందికి గాయాలయ్యాయి. నడుమూరు ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతివేగం వల్లనే అదుపు తప్పి బస్సు బోల్తా పడినట్లుగా తెలుస్తోంది.
కుచ్చుటోపీ
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు రెండు కోట్ల రూపాయల మేర ఓ కెనడియన్ కుచ్చుటోపీ పెట్టాడు. విశాఖపట్నం జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. బాధితులు పోలీసులను ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications