Amaravati: అమరావతికి వరల్డ్ బ్యాంక్ బిగ్ న్యూస్...! కీలక సమయంలో..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే అమరావతి రాజధానికి భారీగా నిధులు విడుదల చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకుతో కలిపి పనిచేస్తున్న ప్రపంచ బ్యాంక్.. రాష్ట్ర ప్రభుత్వానికి సాయం అందిస్తోంది. కేంద్రం గ్యారంటీతో ఇస్తున్న ఈ నిధుల వినియోగంపైనా క్షేత్రస్ధాయిలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు పర్యటనలు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతికి మరో శుభవార్త లభించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు రెండో విడతగా ఇస్తామన్న సాయం రూ.1700 కోట్ల విడుదలకు ప్రపంచ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి రెండో విడతగా సుమారు 200 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 1700 కోట్లు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ నిధుల విడుదలతో రాజధానిలో నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి.

అమరావతి మొదటి దశ నిర్మాణానికి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు చెరో 800 మిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 1600 మిలియన్ డాలర్లు (రూ. 13,600 కోట్లు) సాయం అందించేందుకు అంగీకరించాయి. ఇందులో
ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో తొలి విడతగా 207 మిలియన్ డాలర్లను విడుదల చేసింది కూడా. ఈ నిధుల్లో దాదాపు 50 శాతం మేర వివిధ పనులకు ఖర్చు చేసినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ వెల్లడించారు.

ప్రపంచబ్యాంక్ నిబంధనల ప్రకారం తొలి విడత నిధుల్లో 75శాతం ఖర్చు చేయగానే, రెండో విడత నిధుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో డిసెంబర్ నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాగా రూ.1400 కోట్లను అందించనుంది. రాజధానిలో పనుల పురోగతిని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందాలు ప్రతి నెలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాయి. పనుల అమలు తీరుపై ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదికలో సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో రెండో విడత నిధుల విడుదలకు లైన్ క్లియర్ చేసింది.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications