సోనియాతో ఒప్పందం నిజం కాదా: జగన్‌పై యనమల

 Yanamala Ramakrishnudu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలను కలుషితం చేసేందుకే జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని విమర్శించారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో వైయస్ జగన్మోహన్ రెడ్డి రహస్య ఒప్పందం నిజం కాదా? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. అక్రమాస్తుల కేసులో సిబిఐ నిర్ధారించిన రూ. 43వేల కోట్లను ఎక్కడ దాచారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రజలకు సంతోషాన్ని దూరం చేసింది: బాబు

కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్ర ప్రజలతోపాటు దేశ ప్రజలు కూడా సంతోషానికి దూరమయ్యారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన సోమవారం హోలీ పండగ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కలలు సాకారమైనప్పుడే నిజమైన హోలీ పండగ అని అన్నారు. తన నివాసంలో గిరిజనులు, లంబాడీలతో కలిసి చంద్రబాబు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా హోలీ జరుపుకోలేకపోయారన్న ఆయన.. ఈసారి ఆ పాలన అంతమవుతున్నందున సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలు తీరాలంటే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+