నారా బ్రాహ్మణిపై ఫేక్ ప్రచారం..
తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారమవుతోంది. బ్రాహ్మణి ఒక నిరుపేద మహిళ అని, అలాంటి ఆమెకు రూ.1600 కోట్లతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఫామ్ హౌస్ ను కొనబోతున్నారనేది ఆ వార్త సారాంశం. అంతటి డబ్బులు ఆమెకు ఎక్కడినుంచి వచ్చాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పలు పోస్టులు వైరల్ గా మారాయి.

పరువునష్టం దావాకు సిద్ధం
రాజకీయ నాయకులు కొందరు ఈ విషయంలో ఫేక్ వార్తను ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. బ్రాహ్మణి విజయవంతమైన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారని, ఎటువంటి వివాదాల్లో తలదూర్చరని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ వార్తను ప్రచారం చేస్తున్నవారిపై పరువు నష్టందావా దాఖలు చేయబోతున్నారని ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీ ట్వీట్
దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. తనపైన, తన భార్యపైన ఎవరు ఎటువంటి ఆరోపణలు చేసినా... వెంటనే పోలీసులను పంపించి కేసులు పెట్టించే జగన్ రెడ్డీ... దివంగత ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన మహిళలపై ఫేక్ ప్రచారాన్ని చేయిస్తున్నారని, తనకు ధర్మం.. ఎదుటివారికి ఇంకో ధర్మం ఏమిటో తెలుసుకోవడానికి రంగం సిద్ధమవుతోందంటూ ఒక కొటేషన్ ను షేర్ చేసింది. దానికి ఒక ఫొటోను కూడా యాడ్ చేశారు.

వైరల్ గా మారిన ట్వీట్
టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. వైసీపీ పేటీఎం బ్యాచ్ లో కొందరు ఈ తరహా ఫేక్ వార్తలను పోస్ట్ చేస్తున్నారని, వారిపై పరువు నష్టందావా సిద్ధమవుతోందని పేర్కొంది. ప్రస్తుతం బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. సంస్థను లాభాలబాట పట్టించడంలో బ్రాహ్మణిదే కీలకపాత్ర. హెరిటేజ్ లో రిటైల్ ను విడదీసి, పాలవ్యాపారాన్ని వేరుగా ఉంచారు. కంపెనీని బిలియన్ డాలర్ల సంస్థగా తీర్చిదిద్దడమే తనముందున్న కర్తవ్యమని ఆమె గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఆ దిశగా తన వ్యాపారాన్ని నడిపిస్తున్నారు.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications