Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజకీయ సన్యాసం చేస్తే ప్యాకేజీలు రావు.. పవన్ కల్యాణ్‌కు అంబటి రాంబాబు కౌంటర్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఎంత గింజుకున్నా.. రాష్ట్రంలో అధికారంలోకి రాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటును చీల్చబోమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పవన్‌కు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలపై అవగాహన లేకుండా రోజుకో రకంగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. పవన్ మనసంతా చంద్రబాబు మీదే ఉందంటూ ఎద్దేవా చేశారు.

 టీడీపీతో పొత్తుకు జ‌న‌సేన‌ ఆరాటం

టీడీపీతో పొత్తుకు జ‌న‌సేన‌ ఆరాటం

అసలు జనసేన పార్టీ విధానమేంటో ప్రజలకు అర్ధం కావడంలేదు. కనీసం పవన్ కల్యాణ్‌కైనా అవగాహన ఉందా ? అని అంబటి రాంబాబు చురకలు అంటించారు. ఆయన వ్యాఖ్యలు చూస్తే టీడీపీతో పొత్తుకోసం ఆరాటపడుతున్నట్లు అర్ధమవుతోందని విమర్శించారు. బీజేపీతో గొడవ పడినట్లు తెలుస్తోందన్నారు. అందుకే టీడీపీకి వచ్చేస్తున్నా అనే సంకేతాలు ఇచ్చేందుకు మీటింగ్ పెట్టి డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

 పిట్ట‌ల దొర‌లా ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు..

పిట్ట‌ల దొర‌లా ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు..

జనసేన అధినేత పవర్ కల్యాణ్ నిన్నటి మీటింగ్ పిట్టల దొర వ్యవహారంలా ఉందని అంబటి సెటైర్లు వేశారు. 2024లో వైసీపీ గెలవదు, అధికారంలోకి రాదు అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. గతంలో కూడా పవన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారని దుయ్యబట్టారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే తాను రాజకీయ సన్యాసం చేస్తాంటూ ప్రగల్బాలు పలికారని దుయ్యబట్టారు. రాజకీయ సన్యాసం చేస్తే ప్యాకేజీలు రావన్న సంగతి జనసేన అధినేతకు అర్ధమయినట్లు ఉందని విమర్శించారు. ఇప్పుడు వైసీపీపై లేని పోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ త‌ప్ప‌...

చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ త‌ప్ప‌...

తాను ఎవరి పల్లకీ మోయనంటూనే చంద్రబాబు పల్లకీ తప్ప అన్న షరతును పవన్ కల్యాణ్ పెట్టుకున్నట్లుగా ఉన్నారని అంబటి విమర్శించారు. పవన్ ఓ పల్టీ నాయకుడుని దుయ్యబట్టారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆపార్టీ వ్యతిరేక ఓటును చీల్చాలన్నారు. ఇప్పుడు వైసీపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో రైతులను చంద్రబాబు నట్టేట ముంచారని , ఆవిషయాన్ని పవన్ మర్చిపోయారా అని నిలదీశారు. రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కే దక్కుతుందని చురకలు అంటించారు. రైతులను రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన‌ చంద్రబాబు.. చేశారా అని ప్రశ్నించారు. రైతుల పట్ట ప్రేమాభిమానం సీఎం జగన్‌కు మాత్రేమే ఉందన్నారు. కాబట్టే రైతలకు కాకుండా కౌలు రౌతులకు, ఆర్వోఎఫ్ఆర్ రైతులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తున్నామని అంబటి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+