కొత్త జిల్లాలపై వైసీపీ నేతల అసంతృప్తి.. పార్టీలో కలకలం : వాట్ నెక్ట్స్ ?..
ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటుపై రగడ కొనసాగుతూనే ఉంది. ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలే కాదు అధికార పార్టీ నేతల నుంచి కూడా చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నిర్ణయం లోపభూయిష్టంగా ఉందని మండిపడుతున్నారు. విధానపరమైన నిర్ణయాలు లేకుండా జిల్లాలను విభజించారంటూ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

జిలాల విభజనపై ఆనం అసంతృప్తి
ఏపీలో జిల్లాల విభజన తీరును ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. అడ్డదిడ్డంగా విభజిస్తే వచ్చే సమస్యలను వివరించారు. నాడు అశాస్త్రీయంగా జరిగిన ఏపీ, తెలంగాణ విజభజనతో అనేక సమస్యలు వచ్చాయి. ఇప్పటి వరకు వాటికి పరిష్కారం లభించలేదు. ఇప్పుడు కూడా విధానపరమైన నిర్ణయాలు లేకుండా జిల్లాల విభజన చేస్తే అలాంటి సమస్యలే ఉత్పన్నమైయే ప్రమాదం ఉందన్నారు. కొన్ని బోర్డర్ లైన్లలో ఉన్న మండలాలు, జిల్లాల మధ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.

వెంకటగిరికి తీవ్ర అన్యాయం
జిల్లా విభజన చేయాల్సినప్పుడు శాస్త్రీయబద్ధంగా .. నీళ్లు, నిధులు, గ్రామాలు నుంచి విభజన జరగాలని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. వెంకటగిరి నియోజవర్గంలో ఉన్న రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిల్లా విభజనతో వెంకటగిరి నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో డిలిమిటేషన్, రాష్ట్ర విభజన సమయాల్లో ప్రజలు నష్టపోయారని, మళ్లీ నష్టపోవడానికి సిద్ధంగా లేరని ఆనం స్పష్టం చేశారు.

సోమశీల నీటి కోసం పోలీసులు కొట్టుకోవాలా .?
నెల్లూరు జిల్లా నుంచి రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను తొలగించడం సరికాదని ఆనం పేర్కొన్నారు. జిల్లా విభజనతో సోమశిల ప్రాజెక్టు సగం నెల్లూరు జిల్లా పరిధిలోకి మరొ సగం బాలాజీ జిల్లాకు వెళ్తుందన్నారు. అసలు సోమశీల ప్రాజెక్టును ఏం చేయాలనుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిస్థితి తీసుకువద్దామనుకుంటున్నారా అని నిలదీశారు. నాగార్జున సాగర్ డ్యామ్పై ఏపీ , తెలంగాణ పోలీసులు కొట్టుకున్నట్లుగా సోమశిల ప్రాజెక్టు వద్ద కూడా అలాంటి పరిస్థితి తీసుకువచ్చే ఆలోచన ఉందా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయ స్వార్థంతో కొందరు..
గతంలో కొందరు తమ రాజకీయ స్వార్థంతో రాపూరు నియోజకవర్గాన్ని తొలగించి ఈ మూడు మండలాలను కలిపి వెంకటగిరి నియోజకవర్గం చేశారు. నెల్లూరు జిల్లాలో తమ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అయినా వారి ఆటలు సాగలేదన్నారు. మరొక ప్రాంతంలో పోటీ చేసినా ప్రజలు తమకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఒకరిని ఇబ్బంది పెట్టాలని ఆనాడు ప్రయత్నాలు చేశారు. వారి స్వార్థానికి మూడు మండాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఇప్పుడు మరోసారి రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల ప్రజలు నష్టపోవడానికి సిద్ధంగా లేని ఆనం తేల్చిచెప్పారు. ఈమేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు ఆనం రామనారాయణ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications