దీక్షకు అనుమతివ్వండి: ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్కు వైసీపీ ఎంపీల వినతి
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్తో పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరహారదీక్షకు దిగాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. అయితే ఈ మేరకు దీక్ష చేసుకొనేందుకు అనుమతివ్వాలని కోరుతూ వైసీపీ ఎంపీలు సోమవారం నాడు రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత తమ ఎంపీ పదవులకు రాజీనామాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుమతిచ్చినా లేకున్నా ఎంపీలు ఏపీ భవన్లో దీక్ష చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకుగాను వైసీసీ ఎంపీలు ఆమరణ నిరహరదీక్షను అస్త్రంగా ఎంచుకొన్నారు. ఎంపీల దీక్షకు మద్దతుగా ఏపీ రాష్ట్రంలో కూడ అన్ని కేంద్రాల్లో దీక్షలు చేయాలని ఆ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది.
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఇప్పటికే టిడిపి, వైసీపీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. టిడిపి,వైసీపీల అవిశ్వాస నోటీసులకు కూడ ఇతర పార్టీలు తోడయ్యాయి. అయితే పార్లమెంట్ ఉభయ సభల్లో అవిశ్వాస తీర్మానంపై నోటీసుపై ఇంకా చర్చ సాగడం లేదు. ఈ విషయమై బిజెపియేతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications