గిడ్డి ఈశ్వరి స్థానంలో బాలరాజు*: మరో నలుగురు టిడిపి గూటికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రోజుకో మార్పు చోటుచేసుకుంటుంది నవంబర్ 27 సోమవారం ఉదయం గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడంతో అదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బాలరాజు ను రంగంలోకి దించుతున్నట్లు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రోజుకో మార్పు చోటుచేసుకుంటుంది నవంబర్ 27 సోమవారం ఉదయం గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడంతో అదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బాలరాజు ను రంగంలోకి దించుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే లు మొత్తం 67 మంది ఉండగా ఇప్పటికే వలసల బాటలో పసుపు గూటికి చేరిన వారి సంఖ్య 23 మంది కి చేరింది రోజురోజుకు వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో బలం కొల్పుతున్న పరిస్థితి నెలకొంది .44 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా తాజాగా మరో 4 ఎమ్మెల్యేలు తెలుగు గూటికి చేరిపోతారన్న భయం ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
జగన్ నియంతలా ఒట్టేద్దు పోకడకు నిదర్శనం 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వలస బాట పట్టారని ఆ పార్టీ వర్గాలు చేర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ నాయకత్వానికి మార్గం సుగమం అవుతున్నట్లు కనిపిస్తోంది
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే లు వలస వెళ్లారో ఆ నియోజకవర్గంలో మరో సీనియర్ నేతలను చేరుకుంటున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి.