Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Year Ender 2025: పేదల జీవితాల్లో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వం

2025 కూటమి ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చిన ఏడాది. అటు పరిపాలన, ఇటు అభివృద్ధి.. ఊహించని విధంగా అందరికి సమాన పదవులతో నూతన ఉత్తేజం నింపుకుంది. సమిష్టి కృషితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మందుకు సాగాయి. ఈ నేపథ్యంలోనే 2025 లో పేదల జీవితాల్లో వెలుగులు నింపింది కూడా కూటమి ప్రభుత్వం. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ తో 2025లో తన మార్క్ పాలన చూపించారు సీఎం చంద్రబాబు. సుపరిపాలనతో బ్రాండ్ ఇమేజ్....ప్రభుత్వ చొరవతో లక్షల కోట్ల పెట్టుబడులు.. పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో ఆశలకు నాంది పలికారు. అద్భుత వేగంతో రాజధాని అమరావతి పనులు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే 2025లో ఉషోదయం... ఇక 2026లో నవోదయం నినాదంతో ముందుకు సాగుతున్న ఏపీ సర్కార్ పై స్పెషల్ స్టోరి

2025 ఏడాదిలో కూటమి ప్రభుత్వం అద్భుతమైన విజయాలు సాధించింది. ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలను నెరవేర్చింది. చెప్పని అంశాలను ప్రజలకు అందించింది. విభజనను మించిన విధ్వంసాన్ని 2019-2024 మధ్య కాలంలో గత పాలకులు చేశారు...ప్రజలు అనుభవించారు. 2025 తొలి నాళ్లల్లో రాష్ట్రంలోని వ్యవస్థలు నెమ్మదిగా గాడిలో పడ్డాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో సంక్షేమాన్ని... అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టించింది. కనీ వినీ ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే కొన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించినా... 2025 సంవత్సరంలో మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది.

Year Ender 2025 How the NDA Government Delivered Growth and Governance in This Year

కేంద్రం పూర్తి స్థాయిలో అందిస్తున్న సహకారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా ప్రభుత్వ యంత్రాంగం అందిపుచ్చుకుంది. వివిధ రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించడంతోపాటు... ప్రభుత్వం తీసుకున్న 23 పాలసీలతో దేశాన్ని ఆకర్షించే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుత పనితీరు కనబరిచింది. ప్రముఖ ఎకనమిక్ టైమ్స్ దినపత్రిక అందించే ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025ను అందించింది. రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిందనే విషయాన్ని చెప్పడానికి చంద్రబాబుకు దక్కిన ఈ అవార్డే నిదర్శనం.

సంక్షేమానికి చిరునామాగా...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతూనే ఉంది. 2025 ఏడాదిలో కూటమి ప్రభుత్వం చూపించిన ప్రగతి వేరే లెవల్ అని చెప్పాల్సిందే. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసింది. తల్లికి వందనం కింద రూ.10,090 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తల్లుల ఖాతాలో వేసింది. ఇక స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది కూటమి ప్రభుత్వం. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద 46 లక్షల మంది రైతులకు మేలు జరిగింది. వారి ఖాతాల్లో రూ.6,310 కోట్లు జమ అయ్యాయి. దీపం-2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్‌లను మహిళలకు ఉచితంగా అందించారు. ఇక సామాజిక భద్రత ఫించన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళ్తోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ. 50 వేల కోట్లను పంపిణీ చేశారు. మత్స్యకార భరోసా కింద ఏడాదికి 20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు పంపిణీ చేపట్టింది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఏడాదికి ఒక్కో లబ్ధిదారుకు రూ.15,000... చొప్పున 2.90 లక్షల మందికి రూ.436 కోట్లు జమ చేసింది కూటమి సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా 204 అన్నా క్యాంటిన్లు ఏర్పాటు చేసి... ఇప్పటి వరకు 4 కోట్ల భోజనాలు పెట్టింది.

కొలువుల జాతర... ఉద్యోగ నియామకాలు

ఇక యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీలో భాగంగా ప్రభుత్వం తరపున భారీ ఎత్తున ఉద్యోగాల కల్పనకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టడమే కాకుండా... ఎన్నో అడ్డంకులను అధిగమించి మెగా డీఎస్సీ నిర్వహించింది 15491 మందిని టీచర్లుగా రిక్రూట్ చేసింది. ముఖ్యమంత్రి తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీని 2025లో అమలు చేసింది కూటమి సర్కార్. ఇదే కాకుండా... కానిస్టేబుల్ పోస్టుల నియామకాన్ని పూర్తి చేసింది.. 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందచేసింది కూటమి ప్రభుత్వం. అలాగే శిక్షణ పొందే పోలీస్ కానిస్టేబుళ్లకు స్టైఫండ్ ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేసిందీ ఈ సంతవత్సరమే. ఈ ఏడాది రోడ్ల మరమ్మత్తుల నిమిత్తం రూ.1,000 కోట్ల కేటాయించింది కూటి సర్కారు. అలాగే మరో రూ.3,000 కోట్లతో రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చరిత్రను తిరగరాసేలా పారిశ్రామికాభివృద్ధి

ఇక 2025 ఏడాదిలో ఏపీలో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టింది... చరిత్రను తిరగరాసే దిశగా అడుగులు వేసింది. ముఖ్యంగా ఐటీ, ఏఐ డేటా సెంటర్ తదితర రంగాల్లో కీలక పెట్టుబడులు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మైక్రో సాఫ్ట్ తెచ్చి చంద్రబాబు అభివృద్ధికి బాటలు వేశారు. దాన్ని మరోసారి గుర్తుకు తెచ్చేలా ఈ ఏడాది విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చింది. ఇవే కాకుండా... కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు ఏపీకి వచ్చాయి. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేలా మొత్తంగా 23 కొత్త పాలసీలను రూపొందించింది కూటమి ప్రభుత్వం. అలాగే పరిశ్రమలకు రాయితీల కోసం ఎస్క్రో ఖాతాలు తెరవాలనే నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల నిమిత్తం ఎస్క్రో ఖాతాలు తెరిచే తొలి రాష్ట్రంగా ఏపీ చరిత్రలో నిలిచిపోయింది. ఇక విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్ ది మరో చరిత్ర అనే చెప్పాలి. ఈ సదస్సులో 610 ఒప్పందాలు. రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.13 లక్షల ఉద్యోగాలకు రోడ్ మ్యాప్ సిద్దమైంది.

అమరావతిలో..

అమరావతి క్వాటం వ్యాలీకి ఈ ఏడాదే అడుగులు పడ్డాయి. రూ. 50 వేల కోట్లకు పైగా వ్యయంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. ఈ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకోవడం...స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పారిశ్రామిక రంగానికి అనుకూలంగా పాలసీలు తీసుకురావడంతో సీఎం చంద్రబాబును ప్రతిష్టాత్మక ఎకనమిక్ టైమ్స్ అందించే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు వరించింది. నాయుడు గిరీ అంటే ఏంటో సీఎం చంద్రబాబు చూపించారు. 2025లో కూటమి పనితీరు ఎంత అద్భుతంగా ఉందోనని చెప్పడానికి చంద్రబాబుకు వచ్చిన అవార్డే నిలువెత్తు నిదర్శనం.

ప్రక్షాళన చేశారు... పరుగులు పెట్టిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి మెజార్టీ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. విద్యా వైద్య రంగాలు కుదేలయ్యాయి. ఇక దేవదాయ శాఖ, టీటీడీ వంటి వ్యవస్థలు అపవిత్రం చేసేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇలా అస్తవ్యస్తమైన వ్యవస్థలను...వివిధ శాఖలను ఈ ఏడాది దాదాపు గాడిలో పడ్డాయనే చెప్పాలి. తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెనుమార్పులు తెచ్చారు. 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు ప్రారంభించారు. ఇక విశాఖలో యోగాంధ్ర నిర్వహణ ప్రపంచ రికార్డులను సృష్టించింది. విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చింది.

కర్నూలులో సూపర్ జీఎస్టీ సభ సక్సెస్ అయింది. అలాగే వైద్య రంగంలో సంస్కరణలు తెస్తూ... పేద వైద్య విద్యార్థులకు అదనంగా 110 వైద్య విద్య సీట్లను అందుబాటులో తెచ్చేలా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కీలక పంచాయతీ రాజ్ వ్యవస్థ గాడిలో పడింది. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే రాష్ట్రమంతటా ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణ, దాదాపు 3 వేల పనులకు శ్రీకారం చుట్టారు.

మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్..

విద్యా వ్యవస్థలో పెనుమార్పులను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లను విద్యార్థులకు ఎలాంటి రాజకీయ నేతల బొమ్మలు లేకుండా అందచేశారు. ఇక టీచర్ల బదిలీలను పారదర్శకంగా చేపట్టి...ఆదర్శంగా నిలిచింది విద్యా శాఖ. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 75 లక్షల విద్యార్ధులకు హెల్త్ చెకప్, విద్యార్ధుల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచేలా 'ముస్తాబు' కార్యక్రమాన్ని చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

కొత్తగా 2 జిల్లాలు..

విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ నిలబడింది. రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు వచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 11440 కోట్లతో కేంద్రం ఊతమిచ్చింది. దీంతో లక్ష కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు వచ్చాయి. ఇక ఈ ఏడాది చివర్లో కొత్తగా మరో రెండు జిల్లాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజామోదం లభించింది. దీంతో 26 నుంచి 28కి ఏపీలో జిల్లాల సంఖ్య పెరగనుంది.

2026లో ఘనమైన లక్ష్యాలు

ఇక 2026వ ఏడాదిలో కూడా ఘనమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలను వీలైనంత ఎక్కువ స్థాయిలో పరిష్కరించాలని, వివాదాల్లేని భూములను రైతులకు, భూ యజమానులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలకు మరింతగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందించడంతోపాటు... సంపద సృష్టి, పారిశ్రామికాభివృద్ధి వంటి అంశాలపై దృష్టిపెట్టేలా కూటమి ప్రభుత్వం నూతన ఏడాదివైపు ముందడుగు వేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+