ఈ శ్రీకాకుళం యువతి యమా డేంజర్.. 19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు !!
మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవుతాయి. అందుకే పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి అయినా కానీ మంచి సంబంధం ఫిక్స్ చేసుకోవాలని అంటారు. కానీ ఓ కిలేడీ మాత్రం.. 19 ఏళ్లకే 8 మందిని పెళ్లిళ్లు చేసుకొని.. వివాహం జరిగిన వారం రోజుల్లోపే డబ్బుతో ఉడాయిస్తూ మోసాలకు తెరలేపింది. ఈ యమా డేంజర్ యువతి స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
అసలేం జరిగిందంటే..
ఈ మోసాలకు తెరలేపిన యువతిని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణానికి చెందిన ముత్తిరెడ్డి వాణిగా గుర్తించారు. తన మేనత్త యంపాడ సంధ్యతో కలిసి పెళ్లి పేరుతో మగవారిని మోసం చేయడమే ప్రధాన ప్రవృత్తిగా మారింది. పెళ్లి కాని యువకులను లక్ష్యంగా చేసుకుని 'ఎదురు కట్నం' వసూలు చేసి.. పెళ్లయిన వారం రోజుల్లోపే చెప్పాపెట్టకుండా పరారవ్వడం అలవాటుగా చేసుకుంది. ఇటీవలే సోంపేటలోని దుర్గాదేవి ఆలయంలో వాణి కర్ణాటకకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

అయితే వివాహం అనంతరం వరుడితో కలిసి స్వగ్రామానికి రైలులో వెళ్తుండగా.. విజయనగరం రైల్వే స్టేషన్లో 'బాత్రూమ్' పేరుతో దిగి మాయమైంది. మోసపోయిన వరుడి కుటుంబం ఆమె కోసం తీవ్రంగా గాలించింది. చివరికి వాణి ఇచ్చాపురంలోని మేనత్త ఇంటికి చేరుకుందని తెలిసింది. వరుడి కుటుంబం అప్పటికే వాణికి లక్ష రూపాయల ఎదురు కట్నం.. బట్టలు సహా ఇతర ఖర్చుల నిమిత్తం డబ్బులు చెల్లించింది. ఈ మొత్తం పట్టుకొని పరారవడంతో.. ఆమె జాడ కోసం వెతుకుతూ వరుడి కుటుంబ సభ్యులు మేనత్త సంధ్యను సంప్రదించారు.
ఈ క్రమంలోనే వాణి మోసాల వ్యవహారం బయటపడటంతో బాధితులు సంధ్యను నిలదీశారు. డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పిన సంధ్య.. ఆ తర్వాత అదృశ్యమైంది. దీంతో గురువారం వాణి చేతిలో మోసపోయిన నాగిరెడ్డి, కేశవరెడ్డి ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఫోటోలు, వీడియోలు పోలీసులకు ఆధారాలుగా సమర్పించారు. కాగా వాణి తల్లి చిన్నతనం లోనే మరణించడం.. తండ్రి నిర్లక్ష్యంతో మేనత్త సంధ్య ఆమెను చేరదీసినట్టు తెలుస్తోంది.
కానీ గతంలో సంధ్య మైనర్గా ఉన్నప్పుడు ఇలాంటి మోసాలకు పాల్పడినా.. అప్పుడు మైనర్ కావడంతో ఫిర్యాదులు రాలేదు. ఇప్పుడు వాణికి 19 ఏళ్లు కావడంతో.. ఆమె గత మోసాలు, పెళ్లి వ్యవహారాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. బాధితుల ఫిర్యాదులను స్వీకరించిన ఇచ్చాపురం పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
-
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
నన్ను బలిపశువును చేస్తున్నారు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకం అమల్లోకి..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
ఓటీటీలోకి కిర్రాక్ కామెడీ మూవీ.. పొట్టు పొట్టు నవ్వుకోండి..! -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..?












Click it and Unblock the Notifications