సెల్ఫీ పిచ్చి:గూడ్స్ రైలు ఎక్కి...కరెంట్ షాక్ తో ప్రాణం మీదకు!
విజయవాడ:సెల్ఫీల పిచ్చి మరో యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. గూడ్స్ ట్రైన్తో సెల్ఫీ దిగాలన్న ఉబలాటం ఆ యువకుడిని ప్రాణాపాయంలోకి నెట్టింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శివార్లలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
రైలు పట్టాలపై గూడ్స్ ట్రెయిన్ ఆగి ఉండడంతో సాయి అనే యువకుడు ఆ ట్రెయిన్ ఎక్కి సెల్ఫీ దిగాలని భావించాడు. వెంటనే గబగబా గూడ్స్ ఇంజన్ మీదకు ఎక్కేశాడు. ఆ తరువాత సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఉండగానే ట్రాక్ పైన ఉండే హైటెన్షన్ విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తూ చేతికి తగిలాయి. దీంతో ఒక్కసారిగా హై ఓల్టేజ్ విద్యుత్ శరీరంలోకి ప్రవేశించడంతో తీవ్రమైన విద్యుద్ఘాతానికి గురై కిందపడ్డాడు.

దీంతో తీవ్రంగా గాయపడిన సాయిని స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. సాయి పరిస్థితి పరిశీలించిన వైద్యులు అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోలనకరంగానే ఉన్నట్లు తెలిపారు. ఐసియులో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మరోవైపు యువకుల సెల్ఫీల పిచ్చిపై తల్లదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా రైళ్లెక్కి సెల్ఫీలు దిగే క్రమంలో దేశవ్యాప్తంగా అనేకమంది యువకులు ప్రాణాలు కోల్పోవడం, కరెంట్ షాక్ గురవడం జరగగా...అయినప్పటికీ యువకుల్లో పరివర్తన రాకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ భరత్నగర్లో కూడా రన్నింగ్లో ఉన్న ట్రైన్ ముందు సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు ప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications