అందరూ చూస్తుండగా హత్య: మాటు వేసి 15 చోట్ల కత్తిపోట్లు
కొవ్వూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్.. సమయం బుధవారం సాయంత్రం నాలుగు గంటలు.. ముగ్గురు వ్యక్తులు కత్తులతో మాటు వేశారు. అందరూ చూస్తుండగా.. ఓ యువకుడితో ఘర్షణపడి.. అత్యంత పాశవికంగా 15చోట్ల కత్తులతో నరికి పరా
కొవ్వూరు: కొవ్వూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్.. సమయం బుధవారం సాయంత్రం నాలుగు గంటలు.. ముగ్గురు వ్యక్తులు కత్తులతో మాటు వేశారు. అందరూ చూస్తుండగా.. ఓ యువకుడితో ఘర్షణపడి.. అత్యంత పాశవికంగా 15చోట్ల కత్తులతో నరికి పరారయ్యారు.
రక్తపు మడుగులో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని చూసిన జనం తేరుకునేందుకు చాలా సమయమే పట్టింది. హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు: పాతకక్ష్యల నేపథ్యంలో పట్టపగలు నడి రోడ్డుపై ఒక యువకుడిని అత్యంత క్రూరంగా నరికి చంపారు.
ఈ సంఘటన ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే కొవ్వూరు పట్టణంలో సంచలనం కలిగించింది. స్థానిక 3వ వార్డు క్రిస్టియన్ పేటకు చెందిన గంధం బుజ్జిబాబు(20) రాడ్ బెండింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఇంట్లో పడుకుని ఉన్న బుజ్జిబాబును అతని స్నేహితులు పి.పండు, మరొకరు కలిసి 3.30 గంటలకు బయటకు తీసుకొచ్చారు.
మార్గమధ్యలో ఇద్దరు స్నేహితులు బయటకు వెళ్లడంతో బుజ్జిబాబు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్కు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న వేరొక వర్గం బుజ్జిబాబుతో ఘర్షణకు దిగారు. సుమారు అరగంట సేపు వారి మధ్య వాగ్వాదం సాగింది.