Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబు దగ్గరుండి హత్యలు చేయిస్తున్నారు: జగన్ (ఫొటోలు)

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే సాక్షాత్తూ దగ్గరుండి తమ పార్టీ నేతలను హత్యలు చేయిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఏకపక్షంగా జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

అనంతపురం జైల్లో ఉన్న పార్టీ నేతలు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను ఆయన సోమవారం పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడారు. హత్యలు చేసిన వాళ్లను వదిలేసి, ఎమ్మార్వో కార్యాలయాన్ని ధ్వంసం చేశారంటూ గుర్నాథరెడ్డితో పాటు మరో 40మందిని అరెస్ట్ చేయటం అన్యాయమన్నారు.

ఎమ్మార్వో కార్యాలయాన్నే హత్యా వేదికగా మార్చుకుని, ప్రభుత్వ ఉద్యోగులే ఈ ఘటనల్లో ప్రమేయం ఉండటం దారుణమన్నారు. అనంతపురం జిల్లాలో భూమిరెడ్డి ప్రసాదరెడ్డి హత్య మొదటిది కాదని, గతంలోనూ విజయ్ భాస్కర్ అనే వ్యక్తిని సింగిల్ విండో కార్యాలయానికి పిలిచి రాజీనామా చేయాలని సీఈవో స్వయంగా ఫోన్ చేశారని, అయితే అందుకు నిరాకరించిన విజయ్ భాస్కర్‌ను దారుణంగా హతమార్చారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

భావోద్వేగానికి లోనై ప్రవర్తిస్తే రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి అని కూడా చూడకుండా జైల్లో పెట్టారని ఆయన అన్నారు. ఇటువంటి అన్యాయం ఎవరికైనా, ఎప్పుడైనా జరుగుతుందని ప్రజాస్వామ్యంలో మీడియా తన వంతు బాధ్యతగా గళం విప్పాలని వైఎస్ జగన్ కోరారు.

అనంతపురంలో జగన్

అనంతపురంలో జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అనంతపురం వచ్చారు.

నేతలకు పరామర్శ

నేతలకు పరామర్శ

అనంతపురం జైలులో ఉన్న పార్టీ నాయకుడు గుర్నాథ్ రెడ్డిని వైయస్ జగన్ సోమవారంనాడు పరామర్శించారు.

బాబుపై విమర్స

బాబుపై విమర్స

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతోనే తమ పార్టీ నాయకుల హత్యలు జరుగుతున్నాయని జగన్ విమర్శించారు.

ప్రసాద రెడ్డికి నివాళి

ప్రసాద రెడ్డికి నివాళి

ఇటీవల ఎమ్మార్వో కార్యాలయంలో హత్యకు గురైన పార్టీ నాయకుడు ప్రసాద్ రెడ్డికి జగన్ నివాళి అర్పించారు.

కుటుంబ సభ్యులకు పరామర్శ

కుటుంబ సభ్యులకు పరామర్శ

హత్యకు గురైన ప్రసాద రెడ్డి కుటుంబ సభ్యులను వైయస్ జగన్ సోమవారంనాడు పరామర్శించారు.

అగ్రిగోల్డ్ బాధితుల వినతి

అగ్రిగోల్డ్ బాధితుల వినతి

అగ్రి గోల్డ్ బాధితులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనంతపురంలో వినతిపత్రం సమర్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+