తలపాగా చుట్టి, ఎడ్ల బండిపై జగన్ యాత్ర(పిక్చర్స్)
అనంతపురం: ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిలదీస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతు భరోసా యాత్రలో భాగంగా గురువారం జగన్ వజ్రకరూరులో మండలంలో పర్యటించారు.
ఈ సందర్భంగా అడుగడుగునా రైతులు, మహిళలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొలుత కొనకొండ్ల గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన రైతు జట్కా మస్తాన్వలి కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం కొనకొండ్ల, గూళపాళ్యం, కమలపాడు, వజ్రకరూరు పర్యటనలో మహిళలు, రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి వారి సమస్యలను తెలిపారు.
ముఖ్యంగా రుణమాఫీ కాలేదని జగన్ దృష్టికి తీసుకెళ్లగా అడగకుండానే సమస్యల పరిష్కరించే కాలం వస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జగన్ భరోసా యాత్ర
ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిలదీస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
జగన్ భరోసా యాత్ర
రైతు భరోసా యాత్రలో భాగంగా గురువారం జగన్ వజ్రకరూరులో మండలంలో పర్యటించారు.
జగన్ భరోసా యాత్ర
ఈ సందర్భంగా అడుగడుగునా రైతులు, మహిళలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
జగన్ భరోసా యాత్ర
తొలుత కొనకొండ్ల గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన రైతు జట్కా మస్తాన్వలి కుటుంబాన్ని ఓదార్చారు.
జగన్ భరోసా యాత్ర
అనంతరం కొనకొండ్ల, గూళపాళ్యం, కమలపాడు, వజ్రకరూరు పర్యటనలో మహిళలు, రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి వారి సమస్యలను తెలిపారు.
జగన్ భరోసా యాత్ర
ముఖ్యంగా రుణమాఫీ కాలేదని జగన్ దృష్టికి తీసుకెళ్లగా అడగకుండానే సమస్యల పరిష్కరించే కాలం వస్తుందని భరోసా ఇచ్చారు.
జగన్ భరోసా యాత్ర
అనంతరం వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జగన్ భరోసా యాత్ర
జగన్ వెంట ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి, మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు.