కళ్లు పెద్దవి చేసుకుని వేలు చూపిస్తూ రౌడీలాగా బెదిరించినా...: బాబుపై జగన్ వ్యాఖ్య
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీని సైకో పార్టీగా అభివర్ణిస్తూ అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనపై గురువారం శాసనసభలో దుమారం చెలరేగింది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. ఆయన వైసిపి సభా హక్కుల నోటీసును ఇచ్చింది.
ప్రతిపక్ష పార్టీని సైకో పార్టీగా అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారని, రౌడీ చేష్టలను ప్రజలు హర్షించరని అంటే రాద్ధాంతం చేస్తున్నారని, తమను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అన్నారు. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని జగన్ అన్నారు.
టిడిపి మంత్రి అదే పనిగా రెచ్చగొట్టడానికి సభా సమయం వృధా చేయడానికి తన నోట్లో నుంచి ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి సైకో పార్టీ అంటారని, ఇటువంటి రౌడీ చేష్టలను ప్రజలు సహించరని అంటే ఆదేదో తామే తప్పు చేసినట్లుగా మళ్లీ వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.

ఇదే సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద కళ్లు చేసుకుని ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగానే వేలు చూపిస్తూ రౌడీ మాదిరిగా బెదిరించినా కూడా అది కూడా తమ తప్పే అన్నట్లు చెప్పడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చే ప్రయత్న చేస్తున్నారు. విజ్ఞత లేని ప్రతిపక్షం వల్ల సమస్యలు వస్తున్నాయని, సభా సమయం వృధా చేయడం మంచిది కాదని ఆయన అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications