'ఆ టెక్నాలజీ ఘనత జగన్దే, ఆర్థిక శాస్త్రవేత్తలు ముక్కుమీద వేలు'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, విజయ సాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య ఆదివారం డిమాండ్ చేశారు. వారిని అరెస్టు చేసి టన్నులు, స్టాక్ల వ్యవహారం తేల్చాలన్నారు.
దొంగతనాలకు టెక్నాలజీ వాడిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ప్రపంచ దేశంలోనే దొంగతనాలకు, దోపిడీకి, ప్రజాధనాన్ని కొట్టేయడానికి టెక్నాలజీని వాడుకున్న ఘనత జగన్దే అన్నారు. జగన్ వద్ద ఎన్ని టన్నుల స్టాక్ ఉందో బయటపెట్టాలని ఆయన ఎద్దేవా చేశారు.

జగన్ అవినీతి తవ్విన కొద్ది బయటకు వస్తోందన్నారు. జగన్ విషయం తెలుసుకుని ఆర్థిక శాస్త్రవేత్తలందరూ ముక్కుమీద వేలు వేసుకుంటున్నారన్నారు. దొంగతనానికే జగన్ కొత్త బాష్యం చెప్పారన్నారు. ఈ టన్నుల గొడవను సుప్రీం కోర్టు ముందు ఉంచాలన్నారు.
కాగా, జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ శనివారం నాడు మరో ఆధారాన్ని కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. దాల్మియా సిమెంట్స్ నుంచి జగన్కు హవాలా రూపంలో సొమ్ము అందిన అంశానికి సంబంధించిన ఆధారాలను సేకరించిన సీబీఐ వర్గాలు వాటిని కోర్టుకు ఇచ్చాయి. అందులో టన్నులు అంటే రూ.కోట్లు అని సీబీఐ తేల్చిన విషయం తెలిసిందే.
-
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!!












Click it and Unblock the Notifications