నిన్న గెలిపించినోళ్లే..: బాబు అభిమానించే జిల్లాలో జగన్కు పట్టం!
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా టిడిపికి కంచుకోట. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని కూడా టిడిపి తన ఖాతాలో వేసుకుంది. ఇలాంటి జిల్లాలో జరిగిన తాజా జగన్ సభకు ప్రజలు వెల్లువెత్తారు. ఇక్కడ వైసిపికి గత ఎన్నికల్లో సింగిల్ సీటు రాలేదు.
ఇదే విషయాన్ని చంద్రబాబు పదేపదే ప్రస్తావించిన విషయం తెలిసిందే. మొత్తం సీట్లన్నీ తమకే ఇచ్చిన జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమని పలుమార్లు చెప్పారు. అయితే, జిల్లాలో జగన్ చేపట్టిన తాజా పర్యటన విజయవంతమైంది.
మంగళవారం నాడు ఉభయగోదావరి జిల్లాల పర్యటనకు బయలుదేరిన జగన్.. బుధవారం నాడు జంగారెడ్డిగూడెం వచ్చారు. పట్టణంలోని సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ సభకు పెద్ద ఎత్తున జనాలు హాజరయ్యారు. టిడిపి కంచుకోటలో, అదీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత కూడా జగన్కు పెద్ద ఎత్తున మద్దతు లభించడం గమనార్హం.

కాగా, ఇటీవల గత కొద్ది నెలలుగా వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా టిడిపిలో చేరుతున్న విషయం తెలిసింది. గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు కూడా పలువురు సైకిల్ ఎక్కారు. ఇలాంటి పరిస్థితుల్లోను జగన్కు ప్రజల నుంచి మంచి స్బందన రావడం గమనార్హం.
ఫిరాయింపులపై విజయసాయి ప్రయివేటు పిటిషన్
పార్టీ ఫిరాయింపుల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి రాజ్యసభలో ప్రయివేటు మెంబర్ బిల్లును ప్రవేశ పెట్టున్నారు. ఫిరాయింపుల పైన చట్టాన్ని కఠినతరం చేసే విధంగా ఆర్టికల్ 361బి సవరించాలని, పార్టీ ఫిరాయించిన సభ్యుడికి ఎలాంటి పదవి రాకుండా చట్టాన్ని సవరించాలని సాయి తన బిల్లులో పేర్కొంటున్నారు. ఈ నెల 18వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications