పొట్టి శ్రీరాములు వర్ధంతి, జగన్ నివాళి: అసెంబ్లీకి బిల్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అవతరణకు సంకేతంగా, ఆంధ్రప్రదేశ్ అవతరణకు పాటుపడిన నేతగా పొట్టి శ్రీరాములును పరిగణిస్తూ వస్తున్నారు. అయితే, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ప్రాణాలర్పించలేదనే వాదన, మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోవడానికి మాత్రమే ఆయన ప్రాణత్యాగం చేశారనే సూత్రీకరణ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఇలా ఉంచితే, ఆయన వర్ధంతి రోజునే రాష్ట్ర విభజనకు సంబంధించిన తెలంగాణ ముసాయిదా బిల్లు శాసనసభకు వచ్చింది.
తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో సోమవారం ప్రతిపాదించారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజునే ముసాయిదా బిల్లును ప్రతిపాదించడం యాదృచ్ఛికమే అయినా అది చర్చనీయాంశంగా మారింది. పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజునే విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడం దురదృష్టకరమని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు అన్నారు.

కాగా, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సోమవారం నివాళులు అర్పించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేస్తున్న ఆయన సమైక్యానికి ప్రతీకగా పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని తీసుకుంటున్నారు.

ఇదిలావుంటే, వైయస్ జగన్ సోమవారం ఉదయం పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై సభలో అనుసరించాల్సిన విధానంపై శాసనసభ్యులకు మార్గనిర్దేశం చేశారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications