మనకు ప్రశాంత్ కిషోర్ ఉన్నారు, నన్ను సీఎంగా చేస్తారు!: ప్లీనరీలో జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదిక సాక్షిగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్పై ఆ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆదివారం ప్రశంసలు కురిపించారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదిక సాక్షిగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్పై ఆ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆదివారం ప్రశంసలు కురిపించారు.
నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో రెండో రోజు వైసిపి ప్లీనరీ కొనసాగుతోంది. షర్మిల, విజయమ్మ ఇతర నేతలు మాట్లాడిన అనంతరం జగన్.. ప్రశాంత్ కిషోర్ను పరిచయం చేశారు.
వేదిక పైన ప్రశాంత్ కిషోర్కు జగన్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో కలుపుదామన్నారు. అందుకోసం మనమంతా ఏకమవుదామని చెప్పారు.

మనకు ప్రశాంత్ కిషోర్ తోడుగా ఉన్నారని జగన్ అన్నారు. 2014లో నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి, ఆ తర్వాత బీహార్ పీఠంపై నితీష్ కుమార్ను, పంజాబ్ పీఠంపై అమరీందర్ సింగ్ను కూర్చోబెట్టడంలో ప్రశాంతి కిషోర్ క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. ఇప్పుడు అలాంటి ప్రశాంతి కిషోర్ మన వెంట ఉన్నారని జగన్ చెప్పారు. వైసిపిని అధికారంలోకి తెస్తారని, తనను సీఎం చేస్తారని జగన్ అభిప్రాయపడ్డారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications