ఎమ్మెల్సీ ఫలితాలపై జగన్ ఫస్ట్ రియాక్షన్- ఎవ్వరినీ వదులుకోను-గెలవకపోతే కోట్ల మందికి నష్టం..
తాడేపల్లి : ఎమ్మెల్సీ ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. తాడేపల్లిలో ఎమ్మెల్యేలతో జరుగుతున్న పార్టీ సమీక్షా సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యేలకు గుర్తుచేస్తూనే ఎమ్మెల్సీ ఫలితాలపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్ని కూడా ప్రస్తావించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారంటూ విపక్షాలపై సీఎం జగన్ వ్యాఖ్యలు చేసారు. 21 స్థానాల్లో ఎన్నికలు వస్తే .. అందులో 17 స్థానాల్లో వైసీపీ గెలిచిందన్నారు. మనం మారీచులతో యుద్ధంచేస్తున్నామని, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారని జగన్ ఆక్షేపించారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి అన్నారు.

ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారని, అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి మాత్రమేనని జగన్ తెలిపారు. ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయన్నారు. అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారన్నారు. వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికైతే మంచి చేశామో... వారు ఎమ్మెల్సీ ఓటర్లలో చాలా తక్కువన్నారు. కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో (ప్రత్యక్ష నగదు బదిలీ) ఉన్నవారని జగన్ తెలిపారు. కాబట్టి ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుందని ప్రశ్నించారు.
అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదని సీఎం జగన్ గుర్తుచేశారు.ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి ఇలా జరిగిందన్నారు. ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారని విపక్షాలపై జగన్ మండిపడ్డారు. రాజకీయాల్లో నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు అన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని తాను అనుకోనన్నారు. ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోనన్నారు.
మీతో పనిచేయించి మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు జగన్ ఎమ్మెల్యేలకు తెలిపారు. ఈ అడుగులన్నీ కూడా దానికోసమేనన్నారు. కొన్ని కోట్లమంది మన మీద ఆధారపడి ఉన్నారన్నారు. ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్కు నష్టం అన్నారు. మనం అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారన్నారు.
అందుకే మన గ్రాఫ్ పెంచుకోవాలన్నారు. అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోండని కోరారు. ఈ కార్యక్రమం జరిగితే.. కచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుందన్నారు.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications