మోపిదేవికి అంత చేసినా... జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
కష్టాలెప్పుడూ శాశ్వతంగా ఉండవని, చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుందని, ఇది సృష్టి సహజమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ రేపల్లె పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని, విలువలు, విశ్వసనీయతే తమకు శ్రీరామ రక్ష అని జగన్ తెలిపారు. వ్యక్తిత్వమే మనల్ని ముందుకు నడిస్తుందని గుర్తుచేశారు. రేపల్లెకు చెందిన పార్టీ నేత మోపిదేవి టీడీపీలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మోపిదేవి వెంకట రమణ పార్టీని వీడి వెళ్లిపోవడం బాధాకరమని జగన్ తెలిపారు. మోపిదేవి వెంకటరమణ విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదని తెలిపారు. ఏరోజైనా మోపిదేవి వెంకటరమణకి మంచే చేశామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రిపదవి ఇచ్చామని గుర్తుచేసుకున్నారు. మండలిని రద్దుచేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన పదవిపోకుండా అడిగిన వెంటనే రాజ్యసభకు పంపామన్నారు. ఒక మత్స్యకారుడికి తొలిసారిగా రాజ్యసభ ఇచ్చిన ఘనత తమ పార్టీదన్నారు.

తమకు కష్టాలు కొత్తేమీ కాదని, రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని రేపల్లె నేతలకు జగన్ తెలిపారు. మా నాన్న ముఖ్యమంత్రి, అయినా కష్టాలు వచ్చాయి, పెద్దవాళ్లంతా ఏకమయ్యారు, తప్పుడు కేసులు పెట్టారు, 16 నెలలు జైల్లో పెట్టారు, వేధించారంటూ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. అయినా ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించలేదా అని ప్రశ్నించారు.
మంచివైపు దేవుడు తప్పకుండా ఉంటాడన్నారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications