చంద్రబాబు హామీల ఖర్చు ఇదీ, చేసిన అప్పులు ఇవీ - వెల్లడించిన జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని చెప్పారు. 58 నెలల్లో పథకాల్ని డోర్ డెలివరీ చేశాం. ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామని వివరించారు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పానన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ఇస్తున్న హామీల అమలుకు అయ్యే ఖర్చు వివరాలతో పాటుగా..ఏపీ అప్పుల లెక్కలను జగన్ వెల్లడించారు.
చంద్రబాబు హామీల విలువ
2019-24 వరకు అయిదేళ్ల కాలంలో ఇచ్చిన హామీల అమలులో ఏనాడు కారణాలు చెప్పలేదని జగన్ చెప్పారు. కరోనా, ఆర్దిక కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయలేదన్నారు. 2.70 లక్షల కోట్లు పథకాల కోసం ఖర్చు చేసామని వెల్లడించారు. హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రత్యేక హోదాను అమ్మేసారని జగన్ వ్యాఖ్యానించారు. 2014-19 కాలంలో 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగా..తన హయాంలో 2.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ చెప్పుకొచ్చారు.

2014-19 వరకు అమలు చేసిన పథకాలకు అన్నింటికి కలిపి దాదాపు రూ 70 వేల కోట్లు ఖర్చు అయ్యేదని వివరించారు. చంద్రబాబు ఇస్తున్న హామీల విలువ 1 లక్షా 21,619లక్షల కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు.
చంద్రబాబు అప్పులు
ఖచ్చితంగా అమలు చేయాల్సిన వాటితో కలిపితే చంద్రబాబు పథకాల ఖర్చు కోసం 1,50,178 కోట్లు అవసరమని జగన్ విశ్లేషించారు. ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఫీజు రియంబర్స్మెంట్, గోరుముద్ద, ఈ పథకాలన్నీ ఎవరూ ఆపలేరన్నారు. కష్టపడితేనే ఈ పథకాలు అమలు అవుతున్నాయని వివరించారు.
తాను అమలు చేస్తున్న పథకాలకు రూ 70 వేల కోట్లు వరకు సమకూర్చటమే కష్టంగా మారినా...అమలు చేస్తున్నామని చెప్పారు. దీనికి రెట్టింపు మొత్తంలో నిధులు ఎలా సమకూరుస్తారని జగన్ ప్రశ్నించారు. సంపద గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని.. చంద్రబాబు పాలనలో 14 ఏళ్ల పాటు రాష్ట్రంలో లోటు బడ్జెట్ తోనే కొనసాగిందని అంకెలతో వివరించారు. 2014-19 కాలంలో చంద్రబాబు హయాంలో అప్పులు 21.8 శాతానికి పెరిగాయని గుర్తు చేసారు.
అమలు చేసేవే చెప్పాలి
తన పాలనలో ఏపీలో అప్పుల శాతం 12.13 శాతానికి పరిమితం అయిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో 4.47 శాతం జీఎస్డీపీ ఉండగా...జగన్ హయాంలో 4.83 జీఎస్డీపి ఉందని జగన్ వివరించారు. చంద్రబాబు హయాంలో పన్నుల భారం 6.57 శాతం అయితే జగన్ హయాంలో 6.35 శాతం గా జగన్ వెల్లడించారు. 2019 లో చెప్పిన హామీల్లో 99 శాతం అమలు చేసామన్నారు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పరిగణలోకి తీసుకొని అమలు చేయగలిగినవే చెబుతానని జగన్ స్పష్టం చేసారు.
2014 లో నాడు కూటమి నేతలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని విషయాన్ని జగన్ గుర్తు చేసారు. అమ్మఒడిని రూ 15 వేల నుంచి రూ 17 వేల వరకు పెంచుతూ హామీ ఇచ్చారు. రైతు భరోసా రూ 16 వేలకు పెంచుతున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. దీంతో..జగన్ మేనిఫెస్టో ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే చర్చ మొదలైంది.
-
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్










Click it and Unblock the Notifications