సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ .. రేపటికి వాయిదా
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ శరవేగంగా సాగుతుంది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులపై మంగళవారం నాడు విచారణ కొనసాగింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలని సుప్రీం ఆదేశాలతో, విచారణలో స్పీడ్ పెంచిన నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈరోజు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పెన్నా, రఘురాం సిమెంట్స్ కేసులో అభియోగాల నమోదుపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. దీంతో రేపు మరోమారు కేసుల విచారణ జరగనుంది.
ఇక ఓబులాపురం మైనింగ్ కేసు విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సిబిఐ అధికారులు మరోసారి గడువు కోరారు. దీంతో ఈ కేసు విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.

జగన్ అక్రమాస్తుల కేసులో మరో నిందితుడు గా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ తాను విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులు సడలించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ పిటిషన్ కు సిబిఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. పరిశీలించిన ధర్మాసనం నిమ్మగడ్డ అభ్యర్థనపై తన నిర్ణయాన్ని రేపు వెల్లడిచనుంది . జగన్ అక్రమాస్తుల కేసుల పై విచారణ రేపు మరోమారు కొనసాగనుంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications