రాజధాని జిల్లాలోకి జగన్ పాదయాత్ర ప్రవేశం: 20 రోజుల పాటు యాత్ర
ప్రతిపక్ష నేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర సోమవారం ఉదయం రాజధాని జిల్లా గుంటూరు జిల్లాలో ప్రవేశించింది. జగన్ తన 109 వ రోజు పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగగా...110 వ రోజు ప్రకాశం జిల్లా ఈపూరుపాలెం నుంచి మొదలై గుంటూరు జిల్లాలో అడుగుపెట్టారు.
జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర మొదలయింది. జిల్లాలోని మొత్తం 13 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర కొనసాగనుంది. జిల్లాలో సుమారుగా 20 రోజులు సాగే ప్రజాసంకల్పయాత్రను పూర్తి అయిన తర్వాత జగన్ కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తారు. మరోవైపు వైసిపి ప్రారంభించి 8 సంవత్సరాలు అయిన సందర్భంగా జగన్ ఈ విషయమై ట్వీట్ చేశారు. విలువలతో కూడిన రాజకీయాలను 8 ఏళ్ల క్రిందట ఇదే రోజు ప్రారంభించామని పేర్కొన్నారు.

సోమవారం బాపట్ల నియోజకవర్గం పరిధిలోని స్టూవర్ట్ పురం వద్ద జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో ఉదయం 9 గంటల 10 నిమిషాలకు ప్రవేశించింది. పాదయాత్ర బాపట్ల చేరుకున్న అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ జరగనుంది. అనంతరం బాపట్ల, పొన్నూరు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, వేమూరు, తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల్లో...దాదాపు 275 కిలో మీటర్లకుపైగా జగన్ యాత్ర కొనసాగుతుంది.
-
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్లో సందడి !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications