వైసీపీ ఎమ్మెల్యే పై చేయి చేసుకున్న జగన్ ? టీడీపీ నేత పోస్టు- ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై సీఎం వైఎస్ జగన్ చేయి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు సర్కులేట్ అవుతోంది. తాజాగా ఓ వ్యవహారంలో ఎమ్మెల్యేపై జగన్ దాడి చేశారంటూ విపక్ష కార్యకర్త ఒకరు పోస్టు పెట్టారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మైలవరం ఎమ్మెల్యే వసంత స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారం కృష్ణాజిల్లాలో చర్చనీయాంశమవుతోంది.

వసంతపై చేయి చేసుకున్న జగన్ ?
కృష్ణాజిల్లాలోని మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై సీఎం జగన్ చేయిచేసుకున్నారంటూ సోషల్ మీడియోలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరిగిందన్న వివరాలు లేకపోయినా సోషల్ మీడియాలో వచ్చిన ఈ పోస్టు వైరల్ అవుతోంది. దీంతో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సీఎం జగన్, తన సొంత పార్టీ ఎమ్మెల్యే, తనకు సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి కూడా అయిన వసంత కృష్ణప్రసాద్ పై ఎందుకు చేయి చేసుకుంటారనే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

ఖమ్మం తెలుగుయువత నేత పనే ?
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను సీఎం జగన్ కొట్టారంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తి ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగు యువత నేతగా భావిస్తున్నారు. దీంతో ఆయన పెట్టిన పోస్టు టీడీపీ గ్రూపుల్లో వైరల్ అయినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో సదరు నేత వసంత, జగన్ మధ్య సంబంధాల్ని దెబ్బతీసేందుకే ఈ పోస్టు పెట్టారా లేక దీని వెనుక ఎవరి ప్రోద్భలమైనా ఉందా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు వసంత కృష్ణప్రసాద్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మైలవరం పోలీసులు రంగంలోకి దిగారు.
Recommended Video

వసంత కేబినెట్ అవకాశాల్ని దెబ్బతీసేందుకే ?
వాస్తవానికి వసంత కృష్ణప్రసాద్, వైఎస్ జగన్ మధ్య సుదీర్ఘ అనుభవం ఉంది. వీరిద్దరూ హైదరాబాద్ లో వ్యాపార భాగస్వాములు కూడా. జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ వసంత పాత్రపై సీబీఐ అభియోగాలు చేసింది. దీంతో పాటు స్వయంగా జగన్ పార్టీలో ఎమ్మెల్యేగా వసంత ఉన్నారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలోనూ వసంత కృష్ణప్రసాద్ కమ్మ సామాజికవర్గం నుంచి కేబినెట్ లో చోటు కల్పిస్తారని ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో వసంతను టార్గెట్ చేసుకుని ఈ పోస్టు పెట్టడం ద్వారా జగన్ కూ, ఆయనకూ మధ్య గ్యాప్ పెంచాలని కొందరు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications