సీబీఐ కోర్టులో హాజరైన జగన్: ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ కూడా
అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఆయనతోపాటు రాంకీ గ్రూపు ఛైర్మన్ అయోధ్యరామిరెడ్డి, ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
హైదరాబాద్: అక్రమాస్తుల (ఈడీ)కేసు విచారణలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఆయనతోపాటు రాంకీ గ్రూపు ఛైర్మన్ అయోధ్యరామిరెడ్డి, ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఫిర్యాదును విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకున్న ఈడీ హోదాలోని సీబీఐ కోర్టు ముందు ప్రధాన నిందితుడైన జగన్తోపాటు ఇండియా సిమెంట్స్ ప్రతినిధిగా బీసీసీఐ మాజీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్, ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్దాస్, మాజీ ఐఏఎస్ శామ్యూల్ తదితరులు హాజరయ్యారు.

ఈడీ కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున హాజరు కాలేదు. కాగా, శుక్రవారం న్యాయమూర్తి సెలవులో ఉండటంతో కోర్టు సిబ్బంది వారి హాజరును నమోదు చేసుకుని తదుపరి విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేశారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications