ఏపీ కలెక్టర్ల సమావేశం .. పక్కా ఇళ్ళ విషయంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో తొలిసారి సమావేశం నిర్వహిస్తున్నారు . ఉండవల్లిలోని ప్రజావేదికలో ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం అయిన ఈ సమావేశాలు రెండురోజులపాటుజరగనున్నాయి . ఇక ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నవరత్నాల అమలు ఎజెండాగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది . అలాగే పక్కా గృహాల విషయంలో కూడా కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.

జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ తొలిసారి భేటీ .. రెండు రోజుల పాటు కొనసాగనున్న సమావేశాలు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపించే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల వివిధ శాఖలలో ఐ ఏ ఎస్ ల బదిలీ చేసిన చంద్రబాబు ఇక తాజాగా జిల్లా కలెక్టర్ లతో భేటీ అవుతున్నారు. ప్రజావేదికలో జరుగుతున్న ఈ భేటీలో తొలిరోజు పౌరసరఫరాల డోర్ డెలివరీ, కరువు పరిస్థితులు, వ్యవసాయం, పశుపోషణ, ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, పాఠశాల విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ, గ్రామ వలంటీర్ల వ్యవస్థ, పాలనలో పారదర్శకత, విద్యుత్, మంచినీరు, నిరుపేదల ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

బడ్జెట్ లో ప్రతీ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో జగన్
రాష్ట్రంలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ జిల్లాల్లో గల ప్రాధాన్యత అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి వివరాలు తీసుకోనున్నారు . అంతే కాదు త్వరలో బడ్జెట్ సమావేశం జరగనుండడంతో ఈ సమావేశాలకు అవసరమైన సమాచారాన్ని అధికారుల నుంచి సేకరించి అందుకు అనుగుణంగా జిల్లాలకు నిధుల కేటాయింపు చేయాలనే ఆలోచనలో ఉన్నారు సీఎం జగన్ .

పక్కా ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 8.5 లక్షల మంది అర్హత కలిగిన లబ్ధిదారులకు పుక్కా ఇళ్ల కేటాయింపుకు సంబంధించి జగన్ భారీ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. జగన్ నిర్మాణ ఖర్చులు, నిర్మాణ సమయం మరియు భూమి కేటాయింపు అంశాలపై కలెక్టర్లతో చర్చించనున్నారని సమాచారం . ఈ పక్కా గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసి, ఉగాది పండుగ వరకు లబ్ధిదారులకు అప్పగించాలనే ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తుంది . జగన్ ఈ విషయంలో కలెక్టర్లతో సమావేశం అనంతరం ఈ పథకం యొక్క ముఖ్య వివరాలను ఈ రోజు లేదా రేపు అధికారిక ప్రకటన చేయవచ్చు అని సమాచారం.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications