చంద్రబాబు ఎలా తొక్కేస్తున్నారంటే ? జగన్ షాకింగ్ ట్వీట్..!
ఏపీలో తాజాగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగంతో ప్రశ్నించే గొంతుల్ని అణచివేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రశ్నించే, నిరసన తెలిపే మరియు సమావేశమయ్యే హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, పౌరులు తమ మనోవేదనలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానిక, జవాబుదారీతనం కోరుకోవడానికి అధికారం ఇస్తుందని, అయితే ఏపీలో ఈ ప్రాథమిక ప్రజాస్వామ్య ప్రక్రియ చంద్రబాబు నేతృత్వంలోని నిరంకుశ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నలిపేస్తోందన్నారు.
పోలీసు అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా అసమ్మతిని అణచివేస్తున్నారని, పోలీసు రాజ్యం, నియంతృత్వ వాతావరణాన్ని సృష్టిస్తుందని జగన్ ఆరోపించారు. చట్టబద్ధమైన ఆందోళనలను లేవనెత్తడానికి ప్రజలు లేదా ప్రతిపక్షాలు చేసే ప్రతి ప్రయత్నాన్ని అణచివేత, వేధింపులు , కల్పిత చట్టపరమైన కేసులతో అడ్డుకుంటున్నారన్నారు. ఇది అసమ్మతికి చోటు లేకుండా చేస్తుందని, ప్రజాస్వామ్య స్వేచ్ఛపై ఈ ఉద్దేశపూర్వక దాడి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం యొక్క సారాంశంపై దాడి అన్నారు. ప్రతిపక్షం, ప్రజలు, ప్రజాస్వామ్య ప్రక్రియలను క్రమబద్ధంగా అణచివేయడమే దీని ఉద్దేశమని విమర్శించారు.

ఇలాంటి అణచివేతలకు తాజాగా చోటు చేసుకున్న ఐదు ఘటనల్ని జగన్ ఉదాహరణగా చూపారు. ఇందులో ఈ ఏడాది ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డ్ కు తాను వెళ్లి టూర్ లో నమోదు చేసిన కేసులు, అలాగే ఏప్రిల్ 8న రామగిరిలో లింగమయ్య కుటుంబ పరామర్శకు తాను వెళ్లినప్పుడు నమోదు చేసిన కేసులు, అలాగే జూన్ 11న పొదిలిలో పొగాకు రైతుల పరామర్శకు వెళ్లినప్పుడు పెట్టిన కేసులు, రిమాండ్ కు కోర్టు నిరాకరించడం, జూన్ 18న సత్తెనపల్లిలో పోలీసు దాడుల్లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబ పరామర్సకు వెళ్లినప్పుడు నమోదు చేసిన కేసులు, రిమాండ్లు, చివరిగా బంగారుపాళ్యంలో ఈ నెల 9న మామిడి రైతుల పరామర్శకు వెళ్లిన సందర్భంగా 20 మందిని అనధికారికంగా కస్టడీలోకి తీసుకోవడం వంటివి ఉన్నాయి.

వీటిలో ప్రతి సందర్భంలోనూ అధికారులు "ఇతరులు" అనే అస్పష్టమైన సూచనలతో పాటు ముగ్గురు లేదా నలుగురు పేర్లను జాబితా చేస్తారని, దీని వలన వారు తరువాత ఎక్కువ మందిని ఏకపక్షంగా లక్ష్యంగా చేసుకునే అవకాశం లభిస్తుందని జగన్ తెలిపారు. తన ప్రతి టూర్ సమయంలో, ప్రజల కదలికలను అరికట్టడానికి పోలీసులు తమ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలకు ముందస్తు నోటీసులు ఇస్తున్నారని, ముందస్తు నిర్భంధాలు చేస్తున్నారని తెలిపారు. ఇన్ని వేధింపుల మధ్య కూడా ఏకైక ప్రతిపక్షం వైసీపీ బాధ్యతగా సమస్యలు పరిష్కరిస్తోందన్నారు.
CM @ncbn suppressing dissent with state machinery
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 12, 2025
The right to question, protest, and assemble forms the bedrock of democracy, empowering citizens to freely express their grievances and demand accountability. In Andhra Pradesh, however, this fundamental democratic process is…












Click it and Unblock the Notifications