జగన్ పాదయాత్ర అందుకే..! యనమల షాకింగ్ కామెంట్స్..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరు చెప్తే మండిపడే టీడీపీ నేతల్లో మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ముందు వరుసలో ఉంటారు. సందర్భం దొరికితే చాలు జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టే యనమల.. ఇప్పుడు తాజాగా ఆయన ప్లాన్ చేసిన పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న ఏలూరు జిల్లా వైసీపీ నేతల భేటీలో జగన్ చేసిన పాదయాత్ర ప్రకటనపై స్పందించిన యనమల.. అందుకు గల కారణాన్ని వెల్లడించారు.
తన స్వార్ధ ప్రయోజనాల కోసమే జగన్ పాదయాత్ర చేస్తానంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. అధికారం అనే కుర్చీ కోసమే జగన్ ప్రయత్నాలు అన్నారు.జగన్ కు ఒక్కసారి కుర్చీ ఇచ్చినందుకే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారన్నారు. ఐదేళ్ల జగన్ పాలన రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ళు వెనక్కి నెట్టిందని,జగన్ పాలనలో అవినీతి, దోపిడీ, వ్యవస్థీకృత నేరాలు, శాంతిభద్రతల వైఫల్యంతో రాష్ట్రం నిండిపోయిందని యనమల గుర్తుచేశారు.

జగన్ పాలనలో ప్రజలు ఇప్పటికే నానా కష్టాలు పడ్డారని, జగన్ అంటే అరాచకం, ధరల పెరుగుదల, సున్నా అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం వంటివే గుర్తొస్తాయని యనమల తెలిపారు. నియంతృత్వ, ఫ్యాక్షనిస్ట్ స్వభావం కలిగిన వ్యక్తి జగన్ అన్నారు. జగన్ ప్రవర్తన హిట్లర్, తుగ్లక్, ముస్సోలినీ తరహాలో ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ప్రజలు ఎప్పటికీ నమ్మరని యనమల రామకృష్ణుడు తేల్చిచెప్పేశారు. జగన్ పాదయాత్ర ప్లాన్ పై టీడీపీ నుంచి వచ్చిన తొలి స్పందన ఇదే కావడం విశేషం.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications