జగన్ చేసిన మంచిని గుర్తు చేసుకుంటున్న ప్రజలు..ఓడినా రాజు రాజే..!
జగన్ అధికారంలో లేకపోయిన ఆయన చేసిన మంచి పనులను రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ గురించి ఇప్పుడు విజయవాడలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది.
కర్ణాటక నుంచి నీటిని దిగువకు వదులుతుండటంతో కృష్ణానది తీరాన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడు వరదలు వచ్చినా... కృష్ణలంక ఏరియా మునిగిపోతుండేది. ముఖ్యంగా కృష్ణలంక, సీతమ్మదార, రాణిగారితోట వంటి ప్రాంతాలు నీటమయం అయ్యేవి. లక్షల క్యూసెక్కుల వరద వచ్చి పేదల ఇళ్లను ముంచేస్తుండేది. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో కృష్ణలంక ప్రజలను అక్కడ నుంచి తరలించి పునరావాస కేంద్రాలకు తరలించేవారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు తమ ఇళ్లకు చేరుకునేవారు. అయితే గత జగన్ ప్రభుత్వం తీసుకున్న చొరవతో కృష్ణలంక ప్రజలకు శాశ్వత పరిష్కరం దక్కినట్టు అయింది.

కృష్ణలంక ప్రజలను వరదలను నుంచి కాపాడటానికి కనకదుర్గ వారధి నుంచి కోటినగర్ వరకు 2.6 కిలోమీటర్ల పొడవునా రిటైనింగ్ వాల్ను నిర్మించింది అప్పటి జగన్ సర్కార్. 125 కోట్ల వ్యయంతో మూడు అడుగుల వెడల్పుతో 18 మీటర్ల లోతులో ర్యాఫ్ట్ పద్ధతితో, 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ను నిర్మించడం జరిగింది. ఇప్పుడు జగన్ నిర్మించిన ఆ రిటైనింగ్ వాల్ కృష్ణలంక ప్రాంత ప్రజలకు రక్షణగా నిలిచింది.
ప్రకృతి మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూనే ఉన్నాయి జగన్ గారు చేసిన మంచి…
— FOR 🅰️ REASON (@FAR_IN_X) August 14, 2025
Krishna Lanka Retaining Wall Present Situation 👍
pic.twitter.com/2NM3uBPrwG
భారీగా కురుస్తోన్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వర ఉధృతి పెరిగినప్పటికి రిటైనింగ్ వాల్ కారణంగా కృష్ణలంక ప్రాంత సురక్షింతంగా ఉన్నారు. దీంతో తీర ప్రాంత ప్రజలు జగన్ను చేసిన మంచి పనిని గుర్తు చేస్తున్నారు. జగన్ ముందు చూపు చొరవతో నిర్మించిన ఈ రిటైనింగ్ వాల్ వల్లే కృష్ణలంక ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరికిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications