చెప్పిందే జరుగుతుంది.. సత్యం గెలుస్తుంది: వైఎస్ షర్మిల ఆసక్తికర పోస్ట్!!
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలతో తల పడుతూనే తెలంగాణ రాష్ట్రం విషయంలోనూ ఆసక్తికరమైన పోస్టులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని పెట్టి సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై హోరాహోరీగా యుద్ధం చేసిన వైఎస్ షర్మిల అప్పట్లో కెసిఆర్ కుటుంబం చేసిన అవినీతిని తూర్పారబట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కెసిఆర్ అవినీతికి పాల్పడ్డారని కాగ్ అధికారులకు అవినీతికి సంబంధించిన ఆధారాలను అందించిన వైయస్ షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కెసిఆర్ ను, ప్రాజెక్టును దక్కించుకున్న మేఘా సంస్థను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై అప్పుడే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు.

ఇక తాజాగా రాష్ట్ర ఆర్థిక రంగానికి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పెనుభారంగా మారనుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక పేర్కొంది. 2022 మార్చికి కాళేశ్వరం ప్రాజెక్టు సంస్థకు మొత్తం రూ.96,064 కోట్ల రుణం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని తెలిపింది. ఇందులో 2022 మార్చి నాటికి రూ.87,449.15 కోట్లు తీసుకుందని పేర్కొంది.
2035-36 నాటికి వడ్డీ సహా అక్షరాలా రూ.1,41,544.59 కోట్లు తిరిగి చెల్లించాలని వివరించింది. రుణ ఒప్పందాల ప్రకారం తొలుత పేర్కొన్న వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తేనే తిరిగి చెల్లించాల్సిన సొమ్ము ఇంత ఉంటుందని, వడ్డీ రేట్లు పెరిగితే చెల్లించాల్సిన నగదు కూడా పెరుగుతుందని వెల్లడించింది.
Truth prevails!
— YS Sharmila (@realyssharmila) February 16, 2024
We fought hard then and today we stand vindicated.
No public representative who has guzzled public money can escape.
(file photo: I submitted evidence on the KCR government's corruption into Kaleshwaram project to the CAG Shri G C Murmu ji on October 21st 2022.… pic.twitter.com/IIT9M8OYdi
ఇక కాగ్ నివేదిక ఆధారంగా మరోమారు సోషల్ మీడియా ద్వారా షర్మిల ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఎప్పటికైనా సత్యం గెలుస్తుందని గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గట్టిగా పోరాడి నేడు నిరూపిస్తున్నామని, ప్రజాధనాన్ని గుంజుకున్న ఏ ప్రజా ప్రతినిధి తప్పించుకోలేడు అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
అంతే కాదు గతంలో తాను అక్టోబర్ 21 2022న అధికారి శ్రీ జి.సి ముర్ముకు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలను సమర్పించానని, కాగ్ నివేదిక కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని అంగీకరిస్తుందని వైయస్ షర్మిల పోస్ట్ చేశారు. తాను గతంలో చెప్పిందే నిజమైంది అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications