వివేకా హత్యకు కుట్ర ఇలా-సీబీఐ తాజా ఛార్జిషీట్ లో వెల్లడి-వాళ్లిద్దరూ సేఫ్ ?
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తాజాగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే విస్తృతంగా దర్యాప్తు చేసి పలు ఆధారాలు సంపాదించిన సీబీఐ.. ఈ మేరకు కుట్ర కోణాన్ని వెల్లడిస్తూ తాజా ఛార్జిషీట్ దాఖలు చేసింది. అలాగే ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా, అనుమానితులుగా ఉన్న పలువురి పేర్లు, వారి పాత్రను కూడా ఈ ఛార్జిషీట్ లో పేర్కొంది.
వైఎస్ వివేకా హత్య కేసులో జరుపుతున్న దర్యాప్తులో భాగంగా సీబీఐ కోర్టులో దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ లో గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్ లో దొర్లిన సాంకేతిక తప్పిదాల్ని సవరించి సమర్పించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఛార్జిషీట్లో వివేకా హత్యకు కుట్ర పన్నింది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డే అన్న విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్లలోనూ వీరి పేర్లు పేర్కొన్నా ఈసారి వీరిని ఏ 7, ఏ8లుగా పేర్కొంది.

అలాగే వివేకా హత్యలో ఆయన పీఏ కృష్ణారెడ్డి ప్రమేయంపైనా అనుమానాలున్నట్లు సీబీఐ పేర్కొంది. కానీ ఇందుకు తగిన ఆధారాలు దొరకలేదని వెల్లడించింది. మరోవైపు వివేకా హత్య తర్వాత ఆధారాల ధ్వంసం విషయంలో మిగతా నిందితులకు వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు మనోహర్ రెడ్డి కూడా సహకరించినట్లు సీబీఐ పేర్కొంది. అయితే హత్య కుట్ర విషయంలో మాత్రం ఆయన ప్రమేయంపై ఆధారాలు లభించలేదని తెలిపింది. దీంతో మనోహర్ రెడ్డి సేఫ్ అయినట్లే భావిస్తున్నారు.
అటు వివేకా కేసులో హత్య పథకం, అమలుకు సంబంధించి సీబీఐ పలు కీలక ఆధారాలు సంపాదించింది. ఇందులో వివేకా హత్య జరిగిన సమయంలో ఆయన ఇంట్లో వైఫై రూటర్ కు కనెక్ట్ అయిన ఫోన్లు, వాటి లొకేషన్లు తెలుసుకుంటున్నట్లు సీబీఐ పేర్కొంది. అలాగే వివేకా రాసిన లేఖపై వేలిముద్రల్ని గుర్తించేందుకు జరిపిన నిన్ హైడ్రిన్ పరీక్ష ఫలితాలు ఇంకా అందాల్సి ఉందని కూడా తెలిపింది. హత్య జరిగిన సమయంలో గూగుల్ టేకౌట్, నిందితుల ఫోన్ల లొకేషన్ డేటాను కూడా సీబీఐ తన ఛార్జిషీట్ లో కోర్టుకు సమర్పించింది.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications