వనజాక్షిదే తప్పా:వరంగల్ అమ్మాయి మృతిపై రోజా ప్రశ్న, అనిత ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా గురువారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వనజాక్షి కేసుతో ప్రభుత్వానికి మహిళల పైన గౌరవం లేదని తేలిపోయిందన్నారు.
నాగార్జున విశ్వవిద్యాలయంలో వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థిని చనిపోతే ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

నిజాయితీగా పని చేసిన అధికారుల పైన, ప్రజల కోసం ప్రశ్నించే ప్రతిపక్షం పైన కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎవరు కూడా నిజాయితీగా పని చేసే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎంఎస్తో ఇవ్వాల్సింది మద్యం కాదని, మంచినీళ్లు అని రోజా అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే రోజా తన ప్రవర్తనను మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత అన్నారు. రోజా తన స్థాయని మరిచి ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంగా ఎలా వ్యవహరించాలో వారికి ఇంకా తెలియదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications