వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై జగన్ పార్టీ ఎంపీ పొగడ్తలు, కేసీఆర్‌పై ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పొగడ్తల వర్షం కురిపించారు. ఆ పార్టీకి చెందిన ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సాక్షిగా చంద్రబాబును పొగిడారు.

తెలంగాణలో నానాటికీ పెరిగిపోతున్న విద్యుత్ కోతలపై ఆయన గురువారం మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన విమర్శలు గుప్పించారు. విద్యుత్ విషయంలో కేసీఆర్‌కు సరైన వ్యూహం లేకపోవడం వల్ల వందలాది మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

ఏపీ సీఎం చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరించి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చేశారని కితాబిచ్చారు. చంద్రబాబును తప్పకుండా అభినందించాలన్నారు. జూన్ 2న సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే విద్యుత్ పైన కార్యాచరణ ప్రకటించి ఉండాల్సిందన్నారు.

YSR Congress Party MP praises Chandrababu

వ్యవసాయ అవసరాలకు మూడు నుండి నాలుగు గంటలు మాత్రమే సరఫరా చేయగలమని చెప్పి ఉంటే, దానికి తగినట్లుగా రైతులు సాగు చేసేవారని చెప్పారు. విద్యుత్ కోతలతో పంటలు నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముందుచూపున్న నేతల్లో చంద్రబాబు ఒకరన్నారు. కేసీఆర్‌కు చంద్రబాబులాగా ముందు చూపులేదన్నారు.

తెలంగాణ శాఖలో షర్మిలకు ఏ పదవీ లేదని పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పార్టీలో ఉన్నది వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి మాత్రమేనని, అది కూడా తానేనని అన్నారు. దీపావళి తర్వాత రాష్ట్రంలో షర్మిల పరామర్శ యాత్ర చేపడుతారని తెలిపారు. వైయస్‌ కుటుంబానికి ఆదరణ తగ్గలేదని వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల సమీక్షలో తేటతెల్లమైందని వివరించారు.

వైయస్‌ పథకాలే కొలమానంగా ఇరు రాష్ట్రాలు సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నాయని చెప్పారు. నెల రోజుల్లో రాష్ట్రంలో తమ పార్టీకి ఒక రూపు వస్తుందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామన్నారు. అవసరమైతే వామపక్షాలను, ఇతర పార్టీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రజా ఉద్యమాలను చేపడతామన్నారు.

ఐ ఫోనే వాడతామని.. కవిత

తమ ఇంట్లో అందరం ఐఫోన్‌లనే వాడతామని, ఐపాడ్‌లనూ వినియోగిస్తామని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం అర్ధరాత్రి బేగంపేటలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గాడ్జెట్ రష్ ఎక్స్‌పో ప్రారంభమైంది. ఈ ఎక్స్‌పోను కవిత ప్రారంభించారు.

కుమారుడితో కలిసి కార్యక్రమానికి హాజరైన కవిత, కార్యక్రమంలో భాగంగా ఐఫోన్-6ను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఐఫోన్ గురించి మాట్లాడారు. ఐపాడ్ వినియోగం కూడా తమ ఇంటిలో అధికమేన్నారు. ఐఫోన్ ఎప్పుడూ స్ఫూర్తి కలిగించేదేనని, డిజైన్ గురించి మాట్లాడేవారి తొలి ఎంపిక ఐఫోనే అన్నారు.

English summary
YSR Congress Party MP Ponguleti Srinivas Reddy praises AP Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X