అనంతో వైఎస్ జగన్: టీడీపీకి రైతుల గోడుపట్టదు
అనంతపురం: పంటలు పడక, అప్పుల ఊబిలో కూరుకుపోయి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.
బుధవారం నుంచి ఆయన అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో 145 మంది రైతులు, 26 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.

అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కష్టాల్లో ఉన్న రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాల్సింది పోయి చోద్యం చూస్తుందని జగన్ మండిపడ్డారు. రైతులకు భరోసా కల్పించడానికి తాను ఈ యాత్ర చేపడుతున్నానని జగన్ వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వ పనితీరు పట్ల జగన్ అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications