తెలంగాణ గుండెల్లో వైయస్: షర్మిల, జగన్ నేతృత్వంలో..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారని ఈ సందర్భంగా షర్మిల గుర్తు చేశారు. తెలంగాణలో 17లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించారని తెలిపారు.
ప్రజా సంక్షేమం కోసం వైయస్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని షర్మిల చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజల్లో తమకు అన్యాయం జరుగుతోందన్న బాధ ఉందని, దాన్ని తొలగించాలనే ఆలోచన చేశారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు తానున్నానని వైయస్ భరోసా ఇచ్చారని చెప్పారు.
వైయస్సార్ చనిపోయినప్పుడు వేలాది గుండెలో ఆగిపోయాయని, చనిపోయిన వారిలో ఎక్కువమంది తెలంగాణ వారే ఉన్నారని షర్మిల చెప్పారు. వైయస్సార్ మరణించినా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని షర్మిల అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తూ వైయస్ ఆశయాలను నెరవేరుద్దామని షర్మిల పిలుపునిచ్చారు.