వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ గుండెల్లో వైయస్: షర్మిల, జగన్ నేతృత్వంలో..

|
Google Oneindia TeluguNews

YSR in Telangana hearts, says Sharmila
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు మేలు చేసినవారిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని మించిన నాయకుడు లేరని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల అన్నారు. బుధవారం జరిగిన తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారని ఈ సందర్భంగా షర్మిల గుర్తు చేశారు. తెలంగాణలో 17లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించారని తెలిపారు.

ప్రజా సంక్షేమం కోసం వైయస్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని షర్మిల చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజల్లో తమకు అన్యాయం జరుగుతోందన్న బాధ ఉందని, దాన్ని తొలగించాలనే ఆలోచన చేశారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు తానున్నానని వైయస్ భరోసా ఇచ్చారని చెప్పారు.

వైయస్సార్ చనిపోయినప్పుడు వేలాది గుండెలో ఆగిపోయాయని, చనిపోయిన వారిలో ఎక్కువమంది తెలంగాణ వారే ఉన్నారని షర్మిల చెప్పారు. వైయస్సార్ మరణించినా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని షర్మిల అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తూ వైయస్ ఆశయాలను నెరవేరుద్దామని షర్మిల పిలుపునిచ్చారు.

English summary
YSR Congress Party leader on Wednesday said that YSR is in Telangana peoples hearts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X