జెండా పీకేస్తారు: జగన్ నిర్ణయంపై భారత్ ఏక్తా ఆగ్రహం

YS Jagan
హైదరాబాద్: మంత్రుల బృందం(జివోఎం) సమావేశానికి వెళ్లకుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండాను సీమాంధ్రలో కూడా పీకేస్తారని భారత్ ఏక్తా ఆందోళన్ కన్వీనర్ మల్లు రమేష్ ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. సీమాంధ్రలో ఆ పార్టీ బతికి బట్టకట్టాలంటే జివోఎం సమావేశానికి వెళ్లాలన్నారు.

జివోఎం సమావేశాన్ని బహిష్కరించాలని ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇడుపులపాయ ప్లీనరీలో తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పిన జగన్ ఇప్పుడు జివోఎంను బహిష్కరిస్తామని చెప్పడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

నిలకడలేని విధానాలతో ఆ పార్టీ ప్రజల్లో చులకన అవుతుందన్నారు. సమైక్యాంధ్రకే తాము కట్టుబడి ఉన్నామని, కేంద్రం త్వరలో ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశానికి వ్యతిరేకిస్తున్నామని చెప్పడం ద్వారా ఆ పార్ట అధ్యక్షుడు వైయస్ జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమన్నారు.

కాగా, విభజనకు తమ పార్టీ వ్యతిరేకమని జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీ నేతలు మైసూరా రెడ్డి, కొణతాల రామకష్ణ ఆ లేఖను ఆదివారం పత్రికలకు విడుదల చేశారు. తమ పార్టీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందని, ఎలాంటి విభజనకైనా తాము వ్యతిరేకమని ఆ లేఖలో జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ అక్టోబర్ 3న కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించబోమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+